Site icon NTV Telugu

Bar Council of India Meets AP CM: సీఎం చంద్రబాబుతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధుల భేటీ..

Bci

Bci

Bar Council of India Meets AP CM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు భేటీ అయ్యారు. అమరావతిలో ఇంటర్నేషనల్ లా యూనివర్శిటీ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. బెంగళూరులోని NLSIU , గోవాలోని IIULER స్థాయిలో అమరావతిలో ప్రీమియర్ లా యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని ప్రతినిధుల టీమ్ పేర్కొనింది. సీఆర్డీఏ పరిధిలో బీసీఐకి అనువైన స్థలాన్ని ఎంపిక చేయాల్సిందిగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కునార్ సింఘాల్ కు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

Read Also: Kolkata Doctor case: వెలుగులోకి సందీప్ ఘోష్ క్రూరత్వం.. బాలింత భార్యను కడుపుపై తన్నిన మాజీ ప్రిన్సిపాల్

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. లా యూనివర్శిటీ ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందుకు రావడం సంతోషంగా ఉంది.. న్యాయ సంబంధిత రంగాల్లో నైపుణ్యం సాధించేందుకు బీసీఐ ఏర్పాటు చేసే యూనివర్శిటీల ఆవశ్యకత ఎంతో ఉంది.. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన అర్బిట్రేషన్ సెంటర్ల ఏర్పాటుకు బీసీఐ దోహదపడుతుంది అని సీఎం చంద్రబాబు తెలిపారు.

Exit mobile version