APPSC: దేవదాయశాఖ ఈవో స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఫలితాలు విడుదల..

Appsc

Appsc

దేవదాయ శాఖ ఈవో స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఫలితాలను విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ).. మెయిన్స్ పరీక్ష కోసం అర్హత పొందిన అభ్యర్థుల వివరాలను గురువారం విడుదల చేసింది ఏపీపీఎస్సీ.. దేవాదాయశాఖలోని 60 ఈవో పోస్టుల భర్తీ కోసం.. జులై 24వ తేదీన స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించింది పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌.. 52,915 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా.. అందులో 1,278 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మెయిన్స్ అర్హత పొందిన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచినట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది.. ఇక, మెయిన్స్ పరీక్ష తేదీని త్వరలోనే తెలియజేస్తామని పేర్కొంది ఏపీపీఎస్సీ..

Read Also: Somu Veerraju: 30 పైసలు కూడ ఇవ్వలేదు.. మూడు రాజధానులు అంటున్నారు..