Site icon NTV Telugu

చంద్రబాబులాంటి వాడే దళిత యువతిని హత్యచేశాడు : కొడాలి నాని

గుంటూరు దళిత యువతి హత్య ఘటన విషయంలో చంద్రబాబు, లోకేష్ లపై మంత్రి కొడాలి నాని విరుచుకపడ్డాడు. జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని పక్కదారి పట్టించేందుకే లోకేష్ డ్రామా చేస్తున్నాడని అన్నారు. ఎక్కడో ఫేస్ బుక్ లో పరిచయం అయిన వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. 14 ఏళ్ళు సీఎమ్ గా పని చేసిన చంద్రబాబు లోకేష్ తో లుచ్చా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టించాడు. చంద్రబాబులాంటి వెధవ దళిత యువతిని హత్యచేశాడు. దాన్ని తీసుకుని వచ్చి ముఖ్యమంత్రికి అంటగడతున్నారు అని తెలిపారు.

దళిత మహిళ శవాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను చూసి తట్టుకోలేకే ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ కు ప్రజలు బుద్ధి చెప్పాలి. నిందితుడిని 12 గంటల్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు, యువతిని హత్యచేసిన నిందితుడికి తేడా లేదు. చంద్రబాబు లాంటి వ్యక్తులను జైలుకు పంపించి అంతమొందిస్తే ఇలాంటి సంఘటనలు జరగవు.మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్ కు సీఎం జగన్ పై సవాళ్లు విసిరే స్థాయి లేదు. మహిళల పై దాడులు జరగకూడదనే దిశ చట్టం, దిశ యాప్ తీసుకువచ్చాం. నిందుతులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. చిన్న చిన్న లోపాలుంటే సరిదిద్ది మరింత కఠినంగా చట్టాన్ని అమలు చేస్తాం. రాష్ట్రంలో ఆడపడుచులను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే. ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు యువతి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు. దీని పై లోకేష్ తన తండ్రిని నిలదీయాలి అని పేర్కొన్నారు.

Exit mobile version