Site icon NTV Telugu

AP High Court: మోహన్‌బాబు అండ్ సన్స్‌కు హైకోర్టులో ఊరట..!!

Mohan Babu

Mohan Babu

AP High Court: ప్రముఖ హీరో మంచు మోహన్‌బాబు, ఆయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్‌లకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. 2019 ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా మోహన్‌బాబు, ఆయన కుమారులు తిరుపతిలో ధర్నా నిర్వహించారు. అయితే ఈ ధర్నాపై అప్పటి పోలీసులు పలు కేసులు నమోదు చేయగా.. వీటిపై తిరుపతి కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ విచారణను నిలిపివేయాలని కోరుతూ ఇటీవల మోహన్‌బాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు తాము నిర్వహించిన ధర్నాపై తిరుపతి కోర్టులో జరుగుతున్న విచారణను నిలిపివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.

Read Also:Kashmir: 30 ఏళ్ళ తరువాత కశ్మీర్ థియేటర్లో వేసిన మొట్ట మొదటి సినిమా ఏదంటే..?

మోహన్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం నాడు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాద, ప్రతివాదనలను విన్న హైకోర్టు తిరుపతి కోర్టులో జరుగుతున్న విచారణను 8 వారాల పాటు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా చంద్రబాబు హయాంలో ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించలేదని నిరసిస్తూ 2019 మార్చి 22న మోహన్‌బాబుతో పాటు ఆయన ఇద్దరు కుమారులు తిరుపతి-మదనపల్లి జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. అయితే ఆ సమయంలో సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో మోహన్‌బాబు, విష్ణు, మనోజ్, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల ఏవో తులసినాయుడు, పీఆర్వో సతీష్‌లపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ధర్నాకు పోలీసుల అనుమతి తీసుకోలేదని.. వాహనదారులకు ఇబ్బంది కలిగించారని పోలీసులు ఆరోపించారు.

Exit mobile version