టీటీడీ బోర్డు మెంబర్లలో క్రిమినల్ కేసులు ఉన్నవారు, ప్రత్యేక ఆహ్వానితులు ఎక్కువ మంది ఉన్నారని వేసిన పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. అయితే టీటీడీ బోర్డు మెంబర్లు 18 మందిలో ఇద్దరు మాత్రమే కౌంటర్ దాఖలు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా దాఖలు చేయని వారిని కూడా కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలు చేయకుంటే విచారణ కొనసాగిస్తామని హై కోర్టు స్పష్టం చేసింది. ఆర్డినెన్స్ తెచ్చిన తరువాత జీవో ఇవ్వనందున ఆర్డినెన్స్ చెల్లదని పిటిషనర్ తరుపు న్యాయవాది వాదించారు. దీంతో ఆర్డినెస్స్ పై ప్రత్యేకంగా పిటిషన్ వేయమని పిటిషనరుకు ధర్మాసనం సూచించింది.
జీవోపై హై కోర్టు ఇచ్చిన స్టే పై తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ వేయడంతో భూమనకు మాత్రమే ప్రత్యేక ఆహ్వానితునిగా వుండేందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. భూమన కరుణాకరెడ్డి వేసిన ఇంప్లీడ్ పిటీషన్ విచారణకు అనుమతించద్దని పిటిషనర్ తరుపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. అయితే భూమన స్వప్రయోజనం కోసమే ఇంప్లీడ్ పిటీషన్ వేశారన్న పిటీషనర్ తరుపు న్యాయవాది కోర్టు వివరించారు. ప్రభుత్వం మెమో కాపీ అందిన తరువాత కౌంటర్ దాఖలు చేస్తామని పిటిషనర్ న్యాయవాది తెలిపారు. తాము కౌంటర్ వేసే వరకు స్టే వెకేట్ చేయవద్దని ధర్మాసనాన్ని పిటిషనర్ తరుపు న్యాయవాది కోరారు. మెమో కాపీ అడిగి తీసువాలని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణ మార్చి 11కు వాయిదా వేసింది.