ఏపీ ఫైబర్ నెట్ లాభాలు అప్పులు తీర్చడానికే సరిపోతాయి అని చైర్మన్ గౌతమ్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ అనాలోచిత , నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నిర్ణయాలు వల్ల నష్టం జరిగింది అని తెలిపారు. సిఐడి విచారణ తర్వాత బాధ్యులైన అందరూ బయటకు వస్తారు. తేరా సాఫ్ట్ కు క్రాంట్రాక్టు లు ఇచ్చేప్పుడు అప్పటి మాంత్రి మండలి ఏం చేసింది అని ప్రశ్నించారు. ఆర్ధిక మంత్రి పరిశీలనలోకి రాకుండానే జరిగిందా అని అడిగారు. సమగ్ర దర్యాప్తు తర్వాత బాధ్యులైన అందరు బయటకు వస్తారు…. వారిలో ఐ.ఏ.ఎస్.లు ఉండవోచ్చు అన్నారు. ఏపీ ఎస్.ఎఫ్.ఎల్.సేవలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. లోటు పాట్లు ఉంటే సరిదిద్దుకుంటాం అని తెలిపిన ఆయన సామర్ధ్యం పెంచడం ద్వారా వినియోగ దారులకు మెరుగైన సేవలు అందిస్తాం. రెండు కోట్ల 80లక్షల రూపాయలతో విశాఖలోని ఫైబర్ నెట్ నెట్ వర్క్ విస్త్రతం అవుతుంది. ట్రిపుల్ ప్లే నెట్వర్క్ బాక్స్ లు త్వరలోనే వినియోగదారులకు చేరుస్తాం. రెండు లక్షల కనెక్షన్లు తక్షణమే పెంచాలని ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పిన ఆయన 4800గ్రామాలకు నెట్ వర్క్ విస్తరించాం అని పేర్కొన్నారు.
ఏపీ ఫైబర్ నెట్ లాభాలు అప్పులు తీర్చడానికే సరిపోతాయి..
