ఏపీలో కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 18, 777 శాంపిల్స్ పరీక్షించగా.. 127 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈరోజు కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. ఇక, ఇదే సమయంలో 184 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.
దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,01,95, 561 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,71, 371 కు పెరిగింది.. ఇక, 20,54, 737 మంది పూర్తిస్థాయిలో కోలుకోగా.. 14,428 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 2,206 గా ఉన్నాయని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
