Site icon NTV Telugu

ఏపీలో కొత్త‌గా 82 క‌రోనా కేసులు న‌మోదు

ఏపీలో క‌రోనా కేసులు ఓ రోజు పెరుగుతూ.. ఓ రోజు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. అయితే.. తాజాగా ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం.. ఏపీలో కొత్త‌గా 82 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈరోజు కరోనా కారణంగా ఒక‌రు మ‌ర‌ణించారు. ఇక, ఇదే సమయంలో 164 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.

https://ntvtelugu.com/revanth-reddy-fires-on-cm-kcr/

దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,11,81,664 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2076492 కు పెరిగింది.. ఇక, 2060836 మంది పూర్తిస్థాయిలో కోలుకోగా.. 14,490 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందారు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు 1166 గా ఉన్నాయని ఏపీ ఆరోగ్య శాఖ పేర్కొంది.

Exit mobile version