Site icon NTV Telugu

ఏపీలో భారీగా పడిపోయిన కరోనా కేసులు.. 24 గంటల్లో 2620

జగన్‌ సర్కార్‌ తీసుకుంటున్న చర్యల కారణంగా… ఆంధ్ర ప్రదేశ్‌ లో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుతున్నాయి. నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసులు తగ్గాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 2620 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,50,288 కు చేరింది. ఇందులో 17,79,785 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 58,140 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 50 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 12,363 మంది మృతి చెందారు. ఇకపోతే గడిచిన 24 గంటల్లో ఏపీలో 7504 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 55,002 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 2,12,05,849 కు చేరింది.

Exit mobile version