NTV Telugu Site icon

Buggana Rajendranath: చంద్రబాబు ఎప్పుడు పీఠం ఎక్కినా ఆ లోటు ఉంటుంది..

Buggana

Buggana

Buggana Rajendranath: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ఈ బడ్జెట్ పై వైసీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తుంది.. ఇప్పటికీ కూడా గత ప్రభుత్వం మీదే ఎందుకు మాట్లాడుతున్నారు.. బడ్జెట్ ప్రసంగంలో 25 సార్లు గత ప్రభుత్వం అని 10 సార్లు విధ్వంసమని మాట్లాడారు.. ఉన్నది ఒక్కటే ప్రతిపక్ష పార్టీ.. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వం అన్నారు.. మీరు సుపరిపాలన చేయాలి కదా అని ప్రశ్నించారు. ఇంటింటికీ తిరిగి సూపర్ సిక్స్ అన్నారు.. ఒకటికి పది సార్లు ఇంటి చుట్టూ తిరిగి తిరిగి ఒక్కో ఇంటికి లక్షలు వస్తాయని చెప్పారు.. జగన్ ప్రభుత్వంలో పథకాలు కచ్చితంగా అందరికీ అందాయి.. అలాగే అందుతాయని నమ్మి మోసపోయి ఉండవచ్చు.. వాళ్ళు చెప్పారు.. విని ప్రజలు మోసపోయారు.. సూపర్ సిక్స్ లో ఇప్పటి వరకు అందింది అర్థ దీపమూ.. పావు దీపమో వాళ్లే చెప్పాలి అని బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు.

Read Also: Purandeswari: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజాహిత బడ్జెట్..

ఇక, చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా జీతాలు సరిగ్గా రావు అని మాజీ మంత్రి బుగ్గన అన్నారు. చంద్రబాబును ఓ చాణక్యుడు, కౌటిల్యుడు అని పోల్చారు.. మరి నాకు తెలిసి ఆయనకు ఏదీ సూట్ కాదు.. ఈసారి బడ్జెట్ కూడా సిస్టమాటిక్ గా పొందుపరచలేదు.. బడ్జెట్ బుక్ కలర్ ఎక్కువగా కంటెంట్ తక్కువగా ఉందని సెటైర్లు వేశారు. మాది ఒకటే సిద్ధాంతం.. వైఎస్ఆర్ ది, జగన్ ది.. సింపుల్ లివింగ్.. సింపుల్ థింకింగ్ సిద్ధాంతం అన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం గత ఐదేళ్ల పాలనను హేళన చేయటంతోనే సరిపోతుంది.. మేము అన్నీ డీబీటీ ద్వారానే చేశాం.. మమ్మల్ని ఇంత క్రిటిసైజ్ చేసి ఏదో జరిగిపోతుందని చెప్పి జనాల్ని నమ్మించారు.. మేము చెప్పింది చేయాలని భావించి కొన్ని చెప్పలేదు.. మీరు గెలవటానికి.. మేము ఓడటానికి అబద్ధాలే కారణం అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు.

Read Also: Virat Kohli: కొత్త మైలురాయికి దగ్గర్లో కోహ్లీ.. సచిన్ రికార్డు బద్దలే

అయితే, మీ పాలనలో ప్రజలు అభద్రతాభావంతో బ్రతుకుతున్నారు అని బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ఇవాళ గ్రామాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.. ప్రతీ ఇంట్లో వీళ్ళు ఇచ్చిన హామీ పత్రాలు తీసుకుని మోసపోయారు.. గ్రామాల్లో ప్రజలు అప్పులపాలయ్యారు.. సంపద సృష్టి ద్వారా మీరు గెలిస్తే ఓకే.. కానీ చెప్పినవన్నీ అబద్ధాలు.. మేము కోవిడ్ లో కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేశాం.. గత బడ్జెట్ లో చెప్పిన పెట్టుబడి సాయం ఎవరికైనా అందిందా అని అడిగారు. సూపర్ సిక్స్ లో చెప్పిన విధంగా ఒక్క గ్యాస్ సిలెండర్ తప్ప ఏమీ ఇవ్వలేదు.. జగన్ మ్యానిఫెస్టోను భగవద్గీతలా భావించాలని చెబుతారు.. రైతులకు ఏపీ ప్రభుత్వం తరఫున ఇరవై వేలు ఇస్తామని చెప్పారు.. ఇప్పుడు కేంద్ర నిధులతో కలిపి ఇస్తామంటున్నారు.. స్థూల ఉత్పత్తి విషయంలో అర్థం కానీ లెక్కలు చెబుతున్న చంద్రబాబు.. సంపద సృష్టించారు.. మీది అసలే డబుల్ ఇంజిన్ సర్కార్.. పేదలకు అన్నీ ఇవ్వొచ్చు కదా అని వైసీపీ నేత బుగ్గన ఎద్దేవా చేశారు.