Site icon NTV Telugu

Ap Assembly TDP Protest: వాకౌట్ చేసిన టీడీపీ సభ్యులు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగానికి అడుగడుగునా అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేస్తోంది టీడీపీ. టీడీపీ సభ్యుల నినాదాల మధ్య కొనసాగుతోంది గవర్నర్ ప్రసంగం. గవర్నర్ ప్రసంగం ప్రతులను చించేసి గాల్లోకి విసిరేశారు టీడీపీ సభ్యులు.

గవర్నర్ ప్రసంగం మధ్యలోనే సభ నుంచి వాకౌట్ చేశారు టీడీపీ సభ్యులు. గవర్నర్ తిరిగి వెళ్లే దారిలో టీడీపీ సభ్యులను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు మార్షల్స్. శాసనమండలికి కూడా వెళ్లకుండా అడ్డుకుంటారా అంటూ లోకేష్ మండిపడ్డారు. సభలో మాట్లాడనివ్వడం లేదు.. కనీసం లాబీల్లో కూడా ఉండనివ్వరా అంటూ కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలు బీటెక్ రవితో పాటు మరో ఎమ్మెల్సీని బయటకు తీసుకెళ్ళారు మార్షల్స్. టీడీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల మార్షల్స్ తో వాగ్వాదం చోటుచేసుకుంది.

Exit mobile version