Site icon NTV Telugu

ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు తగ్గుతూ, పెరుగుతూ వస్తున్నాయి. నిన్నటి కంటే ఇవాళ కాస్త పెరిగాయి కరోనా కేసులు. ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా బులినెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో 87,756 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా కొత్త‌గా 6617 పాజిటివ్‌ కేసులు న‌మోదు అయ్యాయి, 57 మంది మృతిచెందారు.. మ‌రోవైపు.. 24 గంట‌ల్లో 10,567 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో… ఏపీలో న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య‌‌ 18,23,856 కు చేరుగా.. ఇప్ప‌టి వ‌ర‌కు 12,109 మంది మృతిచెందారు.. రిక‌వ‌రీ కేసులు 17,40,281 కు పెర‌గ‌గా.. ప్ర‌స్తుతం 71,466 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Exit mobile version