సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది… ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం… బీసీ జనగణన జరపాలని అసెంబ్లీలో తీర్మానించే అంశానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.. అదాని ఎంటర్ ప్రైజెస్ కు 130 ఎకరాలను విశాఖ మధురవాడలో కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఇక, 200 మెగా డేటా సెంటర్, బిజినెస్ పార్కు కోసం 130 ఎకరాల కేటాయించిన ఏపీ కేబినెట్.. ప్రకాశం జిల్లా వాడ్రేవు సహా 5 ఫిషింగ్ హార్బర్ల్ డీపీఆర్లకు ఆమోదం తెలిపింది.. 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ సరఫరా కోసం త్రై పాక్షిక ఒప్పందానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..
మరోవైపు, 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు వీలుగా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి విద్యుత్ కొనుగోలుకు అంగీకారం తెలిపింది కేబినెట్.. ఇక, విశాఖ మధుర వాడలో శారదా పీఠానికి 15 ఎకరాల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం లభించగా… అమ్మ ఒడి పథకానికి 75 శాతం హాజరు ఉండాలన్న అంశంపై విస్తృత ప్రచారం చేసే అంశానికి ఆమోద ముద్ర వేసింది.. మరోవైపు, ఈడబ్ల్యూఎస్ కు ప్రత్యేక శాఖ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ కేబినెట్ సమావేశం. ఇక, ఆంధ్రప్రదేశ్ సినిమా చట్ట సవరణ ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.