ఈనెల 7 వ తేదీ నుంచి ఆనందయ్య మందు పంపిణీ జరుగుతున్నది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజక వర్గంలో ఆనందయ్య మందును పంపిణీ చేశారు. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ఈరోజు మందును పంపిణీ చేయబోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మందును పంపిణీ చేయబోతున్నారు. పీవీఆర్ హైస్కూల్ లో మందును పంపిణీ చేయబోతున్నారు. పీవీఆర్ హైస్కూల్తో పాటుగా, మంత్రి బాలినేని ఇంటి వద్ద కూడా మందును పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి, హైకోర్టు నుంచి అనుమతులు రావడంతో ఆనందయ్య మందు పంపిణీ వేగంగా జరుగుతున్నది.
నేడు ఒంగోలులో ఆనందయ్య మందు పంపిణీ…
