YS Jagan on AP Capital: రాజధానిపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు.. రాజ్యాంగంలో ఎక్కడా లేదు..!
- రాజధానిపై మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
- రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడా లేదు..
- ప్రభుత్వం ఎక్కడ కూర్చుని పని చేస్తుంటే అదే రాజధాని..
- సీట్, మంత్రులు, అధికారులు అందరూ అక్కడి నుంచే పాలన చేస్తారు..
- పాలనా వ్యవస్థ మొత్తం అక్కడి నుంచే నడుస్తుంది..
- నదీ పరివాహక ప్రాంతంలో రాజధాని నిర్మాణం సరికాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan on AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ఎవరి వాదన వారిదిగా ఉంది.. తాము మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తానంటూ వైఎస్ జగన్ ప్రకటించగా.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్.. అమరావతిలో నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించడమే కాదు.. కొత్త అవసరాలకు అనుగుణంగా మళ్లీ భూసమీకరణ చేపట్టింది.. అయితే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అనే పదానికి రాజ్యాంగంలో ప్రత్యేక నిర్వచనం లేదని, భారత రాజ్యాంగంలో ‘రాజధాని’ అనే పదం ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన స్పష్టం చేశారు. “ప్రభుత్వం ఎక్కడి నుంచి పని చేస్తే.. అదే ఆ రాష్ట్ర రాజధాని” అని పేర్కొన్న జగన్.. శాసనసభ, మంత్రులు, అధికారులు అందరూ అక్కడి నుంచే పాలన సాగిస్తారని, పాలనా వ్యవస్థ మొత్తం అక్కడి నుంచే నడుస్తుందన్నదే రాజధాని అసలైన అర్థం అని వివరించారు.
Also Read
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
- Annadata Sukhibhava: అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
- AP Women's Commission Notice: గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు..
అసలు, నదీ పరివాహకంలో రాజధాని నిర్మాణం సరికాదు అన్నారు వైఎస్ జగన్.. అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. నదీ పరివాహక (River Basin) ప్రాంతంలో రాజధాని నగరం నిర్మించాలనుకోవడం సరికాదని, రివర్ బేసిన్లో భవనం కట్టడానికే సాధారణంగా అనుమతి ఉండదని, అలాంటి ప్రాంతంలో మొత్తం నగర నిర్మాణం చేపట్టాలనుకోవడం ప్రమాదకరమైన, అవివేకమైన నిర్ణయం అని విమర్శించారు వైఎస్ జగన్.
అమరావతి అనువైన ప్రదేశం కాదు
అమరావతి భౌగోళికంగా, మౌలికంగా రాజధానికి అనువైన ప్రాంతం కాదని అన్నారు వైఎస్ జగన్.. విజయవాడ, గుంటూరు నగరాలకు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో అమరావతి ఉందని, విద్యుత్, నీరు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు లేని ప్రాంతమని, రోడ్లు, పవర్, వాటర్ కనీస అవసరాలే లేని చోట రాజధాని నిర్మాణం ఎలా సాధ్యం..? అని ప్రశ్నించారు. ఇక, “రివర్ బేసిన్లో భవనాల నిర్మాణానికే అనుమతులు ఉండవు.. అలాంటిది నగరం నిర్మిస్తామనడం సరికాదు” అంటూ జగన్ ప్రభుత్వ నిర్ణయంపై తన అభిప్రాయాన్ని మరోసారి స్పష్టంగా వెల్లడించారు. రాష్ట్ర ప్రజల సౌకర్యం, భద్రత, అభివృద్ధి అవకాశాలను దృష్టిలో పెట్టుకుని రాజధాని నిర్ణయం ఉండాలని, పాలనా కేంద్రం ఎక్కడి నుంచి సమర్థంగా పనిచేస్తుందో అదే రాజధానిగా గుర్తించబడుతుందని పేర్కొన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..
తాజావార్తలు
-
Sreesanth: ‘గంభీర్ నన్ను దేశద్రోహి, F** అంటూ బూతులు తిట్టాడు’.. టీమిండియా మాజీ పేసర్ ఆవేదన..
-
Dhanush: మృణాల్ ఠాకూర్ ప్రేమకు బ్రేక్? డేటింగ్ రూమర్స్ తర్వాత కొత్త ట్విస్ట్ ఇదేనా!
-
iQOO Z11i: iQOO Z11i త్వరలో లాంచ్.. Snapdragon 4 Gen 2 చిప్సెట్, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్
-
Monsoon 2026: అన్నదాతలకు శుభవార్త.. ఎట్టకేలకు పుంజుకున్న రుతుపవనాలు.. ఈ తేదీల్లో వర్షాలు!
-
Toxic Update : ‘టాక్సిక్’ మళ్లీ ట్రాక్లోకి.. యష్ ఫ్యాన్స్ కోసం వచ్చే వారం సాలిడ్ సర్ప్రైజ్?
ట్రెండింగ్
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!