CM Chandrababu: రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం.. కీలక అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: రాష్ట్ర అభివృద్ధిలో బ్యాంకుల పాత్ర అత్యంత కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆయన అధ్యక్షతన సచివాలయంలో 233, 234వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రైతులకు రుణాలు, ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకుల సహకారం, ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో కొత్త ఏడాదిలో చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. వార్షిక రుణ ప్రణాళిక అమలు, వ్యవసాయ రుణాలు, అనుబంధ రంగాల అభివృద్ధి, ఎంఎస్ఎంఈల రుణాల ప్రగతి అంశాలను సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఇప్పటివరకు వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.2.96 లక్షల కోట్ల మేర రుణాలు మంజూరు చేసినట్లు బ్యాంకర్లు సీఎంకు వివరించారు. కౌలు రైతులకు రూ.1490 కోట్ల వ్యవసాయ రుణాలు అందజేసినట్టు తెలిపారు.
Read Also: CM Stalin: ప్రధాని మోడీకి సీఎం స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్..
Also Read
- Thalliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’పై గుడ్న్యూస్.. అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
- YS Jagan: ప్రతి ఓటును కాపాడుకోవాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
- AP PECET-2026 ఫలితాలు విడుదల.. 89.76 శాతం ఉత్తీర్ణత
- CM Chandrababu: స్వర్ణాంధ్ర 2047 విజన్తో ముందుకు ఏపీ.. సింగపూర్లో చంద్రబాబు కీలక ప్రసంగం
అలాగే ఎంఎస్ఎంఈల రంగానికి సంబంధించి రూ.95,714 కోట్ల మేర రుణాలు జారీ చేసిన విషయాన్ని బ్యాంకర్లు వెల్లడించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మరింత మద్దతు అందించి ఉపాధి అవకాశాలు పెంచాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు సూచించారు. అమరావతిని ఫైనాన్షియల్ హబ్గా అభివృద్ధి చేయడం, రాజధానిలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (CBD) ఏర్పాటు అంశాలపై కూడా బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమాలోచనలు జరిపారు. ఈ ప్రణాళికలకు బ్యాంకుల సహకారం అత్యవసరమని పేర్కొన్నారు. ఏపీ టిడ్కో రుణాలు, డ్వాక్రా సంఘాల బ్యాంక్ లింకేజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు బ్యాంకుల సహకారం, స్టార్టప్లకు రుణ సౌకర్యాలు వంటి అంశాలపై సీఎం విస్తృతంగా సమీక్షించారు. ప్రజలకు సులభంగా రుణాలు అందేలా ప్రక్రియలను మరింత సరళతరం చేయాలని బ్యాంకులకు సూచించారు. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, కొండపల్లి శ్రీనివాస్, ముఖ్య కార్యదర్శి విజయానంద్, యూనియన్ బ్యాంక్ ఎండీ, ఆర్బీఐ ప్రాంతీయ డైరెక్టర్, నాబార్డు జీఎం హాజరయ్యారు. వివిధ జాతీయీకృత, ప్రైవేట్ బ్యాంకుల ప్రతినిధులు, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ డైరెక్టర్లు కూడా సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బ్యాంకర్లు భాగస్వాములుగా ముందుకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Jobs In RBI: డిగ్రీ, పీజీ అర్హత.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెలకు రూ.1.50 లక్షలు..
-
T20 World Cup: పాక్పై గెలిచినా తగ్గని కసి.. డచ్ జట్టుపై భారీ విజయమే లక్ష్యంగా బరిలోకి టీమిండియా..
-
Save The Tigers 3: జూన్ 19 నుంచి సరికొత్త ట్విస్టులతో ‘సేవ్ ది టైగర్స్ 3’
-
Giorgia Meloni: జీ 7 సదస్సుకు కుమార్తెతో హాజరైన మెలోని.. ఫొటోలు వైరల్
-
Natti Kumar: ‘పెద్ది’ కలెక్షన్లపై వస్తున్న రూమర్స్ అన్నీ అబద్ధం!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?