CM Chandrababu: రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం.. కీలక అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: రాష్ట్ర అభివృద్ధిలో బ్యాంకుల పాత్ర అత్యంత కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆయన అధ్యక్షతన సచివాలయంలో 233, 234వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రైతులకు రుణాలు, ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకుల సహకారం, ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో కొత్త ఏడాదిలో చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. వార్షిక రుణ ప్రణాళిక అమలు, వ్యవసాయ రుణాలు, అనుబంధ రంగాల అభివృద్ధి, ఎంఎస్ఎంఈల రుణాల ప్రగతి అంశాలను సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఇప్పటివరకు వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.2.96 లక్షల కోట్ల మేర రుణాలు మంజూరు చేసినట్లు బ్యాంకర్లు సీఎంకు వివరించారు. కౌలు రైతులకు రూ.1490 కోట్ల వ్యవసాయ రుణాలు అందజేసినట్టు తెలిపారు.
Read Also: CM Stalin: ప్రధాని మోడీకి సీఎం స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్..
Also Read
- Nadendla Manohar: మనమంతా పవన్ కల్యాణ్ కోసమే.. గ్రూప్ రాజకీయాలు వద్దు..
- Pawan Kalyan: నీట్ నిరసనలపై పవన్ కీలక వ్యాఖ్యలు.. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి..
- Pawan Kalyan : ఎర్రచందనం మాఫియాకు పవన్ వార్నింగ్.. మూలాలతో సహా నిర్మూలించాలి..
- Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
అలాగే ఎంఎస్ఎంఈల రంగానికి సంబంధించి రూ.95,714 కోట్ల మేర రుణాలు జారీ చేసిన విషయాన్ని బ్యాంకర్లు వెల్లడించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మరింత మద్దతు అందించి ఉపాధి అవకాశాలు పెంచాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు సూచించారు. అమరావతిని ఫైనాన్షియల్ హబ్గా అభివృద్ధి చేయడం, రాజధానిలో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (CBD) ఏర్పాటు అంశాలపై కూడా బ్యాంకర్లతో సీఎం చంద్రబాబు సమాలోచనలు జరిపారు. ఈ ప్రణాళికలకు బ్యాంకుల సహకారం అత్యవసరమని పేర్కొన్నారు. ఏపీ టిడ్కో రుణాలు, డ్వాక్రా సంఘాల బ్యాంక్ లింకేజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు బ్యాంకుల సహకారం, స్టార్టప్లకు రుణ సౌకర్యాలు వంటి అంశాలపై సీఎం విస్తృతంగా సమీక్షించారు. ప్రజలకు సులభంగా రుణాలు అందేలా ప్రక్రియలను మరింత సరళతరం చేయాలని బ్యాంకులకు సూచించారు. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, కొండపల్లి శ్రీనివాస్, ముఖ్య కార్యదర్శి విజయానంద్, యూనియన్ బ్యాంక్ ఎండీ, ఆర్బీఐ ప్రాంతీయ డైరెక్టర్, నాబార్డు జీఎం హాజరయ్యారు. వివిధ జాతీయీకృత, ప్రైవేట్ బ్యాంకుల ప్రతినిధులు, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ డైరెక్టర్లు కూడా సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బ్యాంకర్లు భాగస్వాములుగా ముందుకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం.. చరిత్ర స్పష్టించిన మీరాబాయి చాను..
-
Bandi Sanjay : ‘జెన్-జీకి మంత్రి పదవులు ఇవ్వండి’.. రేవంత్కు బండి సంజయ్ సవాల్
-
NTA Exam Reform: పరీక్షా సంస్కరణల హైపవర్ కమిటీ సభ్యులు వీరే..
-
VVS Laxman: జింబాబ్వే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వీవీఎస్ లక్ష్మణ్పై ప్రశంసల జల్లు..
-
Zimbabwe Captain: సికందర్ రజా అరుదైన రికార్డు.. రోహిత్, బాబర్లను దాటేసిన జింబాబ్వే కెప్టెన్..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!