CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: పశ్చిమ ఆసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన పొదుపు చర్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని, ఈ సమయంలో ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రధాని సూచించిన ఎనిమిది అంశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరిన చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఒకటి రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. పొదుపు చర్యలు తప్పనిసరి అవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.
పెట్రోలు, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భవిష్యత్తులో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వ వ్యవస్థల్లో కూడా ఈ తరహా విధానాలను అమలు చేసే పరిస్థితులు వస్తాయని అభిప్రాయపడ్డారు. దేశంలో దుబారాను తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొన్న చంద్రబాబు, పెద్ద పెద్ద కాన్వాయ్ వాహనాల్లో తిరగడం ఒక ఫ్యాషన్గా మారిందన్నారు. ప్రజాప్రతినిధులు ఆదర్శంగా నిలుస్తూ కాన్వాయ్ వాహనాల సంఖ్యను తగ్గించుకోవాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లను కూడా అవసరానికి తగ్గట్టు కుదించుకోవాలని అభిప్రాయపడ్డారు.
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
విదేశీ పర్యటనలను తగ్గించాలని ప్రధాని మోడీ చేసిన సూచనలను కూడా పాటించాలని సీఎం కోరారు. భారతదేశంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, విదేశాలకు వెళ్లడం కంటే దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని అన్నారు. “నా దేశం – నా బాధ్యత” అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. బంగారం కొనుగోళ్లను తగ్గించాలని ప్రధాని చేసిన వ్యాఖ్యలపై కూడా ప్రజలు ఆలోచించాలని సూచించారు. అయితే, సీఎం చంద్రబాబు వ్యాఖ్యలతో రాష్ట్రంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోందనే అంశంపై రాజకీయ, ఆర్థిక వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.
తాజావార్తలు
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
-
Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
-
PoK Unrest 2026: పతనం అంచున పీఓకే.. పాలకులపై తిరగబడ్డ జనం! భారత్లో కలవడానికి పీఓకే మొగ్గు చూపుతోందా?
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!