CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: పశ్చిమ ఆసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన పొదుపు చర్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని, ఈ సమయంలో ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని సీఎం పిలుపునిచ్చారు. ప్రధాని సూచించిన ఎనిమిది అంశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరిన చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఒకటి రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. పొదుపు చర్యలు తప్పనిసరి అవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.
పెట్రోలు, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయవచ్చని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. భవిష్యత్తులో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వ వ్యవస్థల్లో కూడా ఈ తరహా విధానాలను అమలు చేసే పరిస్థితులు వస్తాయని అభిప్రాయపడ్డారు. దేశంలో దుబారాను తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొన్న చంద్రబాబు, పెద్ద పెద్ద కాన్వాయ్ వాహనాల్లో తిరగడం ఒక ఫ్యాషన్గా మారిందన్నారు. ప్రజాప్రతినిధులు ఆదర్శంగా నిలుస్తూ కాన్వాయ్ వాహనాల సంఖ్యను తగ్గించుకోవాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లను కూడా అవసరానికి తగ్గట్టు కుదించుకోవాలని అభిప్రాయపడ్డారు.
Also Read
- Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు
- TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
- CM Chandrababu: అన్ని సర్వేల్లో కూటమిదే గెలుపు.. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా విజయం మనదే..!
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
విదేశీ పర్యటనలను తగ్గించాలని ప్రధాని మోడీ చేసిన సూచనలను కూడా పాటించాలని సీఎం కోరారు. భారతదేశంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, విదేశాలకు వెళ్లడం కంటే దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని అన్నారు. “నా దేశం – నా బాధ్యత” అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. బంగారం కొనుగోళ్లను తగ్గించాలని ప్రధాని చేసిన వ్యాఖ్యలపై కూడా ప్రజలు ఆలోచించాలని సూచించారు. అయితే, సీఎం చంద్రబాబు వ్యాఖ్యలతో రాష్ట్రంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోందనే అంశంపై రాజకీయ, ఆర్థిక వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.
తాజావార్తలు
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్గా ఇలా చేయండి!
-
Petrol-Diesel Price: హార్ముజ్లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!