Minister Payyavula Keshav: ఢిల్లీ, కాశీ, కోల్కతా, లండన్ ఎక్కడున్నాయి జగన్.. మంత్రి పయ్యావుల కౌంటర్
- ఢిల్లీ, కాశీ, కోల్కతా, లండన్ ఎక్కడున్నాయి..?..
- వైఎస్ జగన్ను నిలదీసిన మంత్రి పయ్యావుల..
- అన్ని నగరాలు నదుల పక్కనే ఉన్నాయి..
- నాగరికత మొదలయింది నదుల పక్కనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Payyavula Keshav: రాజధాని అమరావతి విషయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్కు దిగారు మంత్రి పయ్యావుల కేశవ్.. మరి ఢిల్లీ, కాశీ, కోల్కతా, లండన్ ఎక్కడున్నాయి జగన్..? అంటూ ప్రశ్నించిన ఆయన, ప్రపంచంలోని అనేక ప్రముఖ నగరాలు, రాజధానులు నదుల ఒడ్డునే ఉన్నాయని గుర్తుచేశారు. కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పయ్యావుల.. నాగరికత మొదలైంది నదుల పక్కనే. మనిషి జీవన వికాసం, సంస్కృతి, వాణిజ్యం, రాజ్య వ్యవస్థలు నదీ తీరాల నుంచే పుట్టాయి. అలాంటిది నది పరివాహక ప్రాంతంలో రాజధాని నిర్మించటం తప్పు అనటం అర్థరహితం అంటూ ధ్వజమెత్తారు.
Also Read
- YS Jagan: అందుకే "మావిగన్" ప్రతిపాదన.. స్పష్టం చేసిన జగన్
- Amaravati Farmers: జగన్ను కలిసిన రాజధాని ప్రాంత రైతులు.. తమను వేధిస్తున్నారని ఆవేదన
- Pawan Kalyan: పన్నులు ఎగవేస్తే ఉపేక్షించం.. పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్
- Prepaid Electricity System: ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం.. స్మార్ట్ మీటర్లతో అమల్లోకి కొత్త వ్యవస్థ
అమరావతి అంశంలో జగన్ చేస్తున్న విమర్శలు పూర్తిగా అవాస్తవాలేనని మంత్రి మండిపడ్డారు పయ్యావుల.. అబద్ధాలు ఈ స్థాయిలో చెప్పొచ్చా..? అని ఇవాళ జగన్ నిరూపించారు. అబద్ధాలు ఫీడ్బ్యాక్ ఇచ్చే వ్యవస్థలో ఆయన ఉన్నారా..? లేక ఆయన చుట్టూ ఉన్న టీమ్ తప్పుదారి పట్టిస్తోందా..? అర్థం కావడం లేదు” అని వ్యాఖ్యానించారు. ఇక, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై జగన్ చేసిన ఆరోపణలపైనా పయ్యావుల స్పందించారు. జగన్ చేసింది కేవలం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ డిపిఆర్ మాత్రమే. ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ పనులు జరగలేదు. మరి ప్రాజెక్టును ఆపేశారని ఆయన ఎలా చెప్తారు..? అసలు ఆగింది ఏమిటి..? ఆపింది ఎవరు..?” అంటూ నిలదీశారు.
వెలిగొండ, హంద్రీనీవా ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం చేసిన పనులను చూపించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు మంత్రి పయ్యావుల.. వెలిగొండ ఎక్కడ కట్టారు..? ఒకసారి వెళ్లి చూద్దాం. హంద్రీనీవాలో ఏ పనులు జరిగాయో ఆధారాలతో చూపిస్తాం. మాట్లాడితే క్రెడిట్ చోరీ అంటున్నారు. అసలు క్రెడిట్ ఎక్కడిది..? చోరీ ఎక్కడ జరిగింది..?” అని ప్రశ్నించారు. మరోవైపు, భోగాపురం విమానాశ్రయ అంశంలోనూ జగన్కు ఎలాంటి క్రెడిట్ లేదన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్కు సంబంధించిన అన్ని అనుమతులు చంద్రబాబు, అశోక్ గజపతి రాజు హయాంలోనే వచ్చాయి. మరి ఇందులో జగన్ క్రెడిట్ ఎక్కడిది..? అని ప్రశ్నించారు.
ఇక, వైఎస్ జగన్ గతంలో సీఎంగా ఉన్నప్పుడు 9 నుంచి 5 గంటల వరకు మాత్రమే పనిచేశారని, కానీ, చంద్రబాబు మాత్రం ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రజల కోసం పని చేస్తారని పోల్చిచెప్పారు పయ్యావుల.. పని చేస్తే ప్రజలే క్రెడిట్ ఇస్తారు. కానీ అవినీతి ఆరోపణలు, అసత్య ప్రచారాలతో జగన్ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారు. ఇకనైనా రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు మానుకోవాలి. రాజధానిపై అర్థంలేని విమర్శలు చేయకుండా అభివృద్ధికి సహకరించాలి అని హితవు పలికారు. జగన్కు బ్రీఫింగ్ ఇచ్చే టీమ్ను మార్చుకోవాలని సూచించిన పయ్యావుల, ఇంకా సజ్జల లాంటి వాళ్లపై ఆధారపడితే వై నాట్ 175 నినాదం టీడీపీ ఖాతాలోకి వెళ్లడం ఖాయం అని వ్యాఖ్యానించారు. రాజధాని, ప్రాజెక్టుల అభివృద్ధిపై అసెంబ్లీ వేదికగా బహిరంగ చర్చకు రావాలని ప్రతిపక్షానికి సవాల్ విసిరారు మంత్రి పయ్యావుల కేశవ్..
తాజావార్తలు
-
Palak Pakoda Recipe: సింపుల్గా ఇంటి వద్దే కరకరలాడే పాలక్ పకోడాలు.. ఇలా రెడీ తయారు చేయండి..
-
West Bengal Politics: మమతా పార్టీలో ‘‘షిండే’’ రాజకీయాలు.. తృణమూల్లో తీవ్ర సంక్షోభం..
-
Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
-
Nepal VS India Explained: భారత్-నేపాల్ మధ్య మళ్లీ మంటలు.. ఈ రాజకీయ భూకంపానికి కారణం ఏంటి?
-
YS Jagan: అందుకే “మావిగన్” ప్రతిపాదన.. స్పష్టం చేసిన జగన్
ట్రెండింగ్
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!