Site icon NTV Telugu

Andhra Pradesh: రెవెన్యూ శాఖలో ఆ పోస్టు పేరు మార్పు

Ap Govt

Ap Govt

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఏపీ రెవెన్యూ శాఖలో ఓ కీలక మార్పు చేసింది. శాఖ పరిధిలోని ఎంఆర్‌ఓ (MRO) కార్యాలయాల్లో ఉన్న “జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్” పోస్టు పేరును మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై “జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్” పోస్టును “జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్”గా పరిగణించనున్నారు. ఈ మేరకు అధికారిక ఆదేశాలు వెలువడ్డాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, అన్ని ఎంఆర్‌ఓ కార్యాలయాల్లో ఈ కొత్త హోదా అమల్లోకి వస్తుంది. సంబంధిత రికార్డులు, అధికారిక పత్రాలు మరియు సేవా వివరాల్లో కూడా కొత్త పేరును నమోదు చేయాలని సూచించారు. ఈ మార్పు పరిపాలనా సౌలభ్యం మరియు హోదా స్పష్టత కోసం చేపట్టినదిగా తెలుస్తోంది.

Read Also: Hyderabad ATM Theft: నైస్‌గా స్కెచ్చేశాడు.. స్మార్ట్‌గా రూ.60 లక్షలు దోచేశాడు.. కట్‌చేస్తే..

Exit mobile version