సీఎంఆర్ఎఫ్ నిధులు గోల్మాల్ కావడం ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపింది.. అయతే, గతంలో వెలుగు చూసిన సీఎంఆర్ఎఫ్ కుంభకోణం విచారణలో స్పీడ్ పెంచింది అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ).. సీఎంఆర్ఎఫ్ విభాగంలో కొంత మందిని గతంలోనే విచారించిన ఏసీబీ అధికారులు.. గతంలో జరిపిన విచారణకు హాజరు కాని మరొ కొందరు సిబ్బందని ఇప్పుడు ప్రశ్నిస్తోంది.. గతంలో విచారణకు హాజరు కాకపోవడంతో మరోసారి విచారణకు పిలిచింది ఏసీబీ.. మరోవైపు.. ఈ కేసులో స్పీడ్ పెంచిన ఏసీబీ.. ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు.. ఇక, ప్రజా ప్రతినిధుల వద్ద పని చేసే కొందరి వ్యక్తిగత సిబ్బంది పాత్ర పైనా గతంలోనే అనుమానాలు వ్యక్తం చేసిన ఏసీబీ.. వారిని కూడా విచారణకు పిలచే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
సీఎంఆర్ఎఫ్ నిధుల గోల్మాల్ కేసు.. స్పీడ్ పెంచిన ఏసీబీ
