Vizag Theft Case: వీర వనిత.. కత్తితో పొడిచినా, నలుగురు దుండగుల్ని ప్రతిఘటించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Married Woman Fought With 4 Robbers In Vizag: ఆమె ఒక్కతే.. వాళ్లు నలుగురు. పైగా వారి చేతిలో కత్తులున్నాయి. అయినా సరే, ఆ మహిళ ఏమాత్రం భయపడకుండా, వారిని ప్రతిఘటించింది. తీవ్ర గాయాలపాలైనా, లెక్క చేయకుండా వీర వనితలా ఎదురించింది. చివరికి వారి నుంచి తప్పించుకొని, ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. పెందుర్తిలోని చీమలపల్లిలో ఉన్న చెరువుగట్టు ప్రాంతంలో ఆళ్ల అప్పారావు అనే కుటుంబం నివసిస్తోంది. ఆయన తన భార్య లలితకుమారి, ఇద్దరు కుమారులు (వినయ్కుమార్, అవినాష్కుమార్) కలిసి ఉంటున్నారు. ఆయన కుమార్లో ఒకరైన అవినాష్కు ఇటీవల లావణ్యతో వివాహం అయ్యింది. మంగళవారం రాత్రి ఎప్పట్లాగే అవినాష్ విధులకు వెళ్లారు. కుటుంబ సభ్యులంతా ఓ గదిలో ఉండగా.. మరొక గదిలో లావణ్య ఒక్కతే నిద్రిస్తోంది.
కట్ చేస్తే.. అదే రోజు అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో, నలుగురు దుండగులు దొంగతనం చేసేందుకు వచ్చారు. ఇంటి కిటికీ గ్రిల్ను తొలగించి.. లోపలికి ప్రవేశించారు. అప్పటివరకూ చప్పుడు కాకుండా, జాగ్రత్తగా లోనికి వెళ్లారు. అత్త, మామయ్య, బావ పడుకున్న గదికి బయట నుంచి గడియ పెట్టేశారు. లావణ్య గది తలుపుని బద్దలుకొట్టి.. లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశారు. అయితే.. ఆ శబ్దానికి లావణ్య నిద్ర లేచింది. లావణ్య నిద్రలేచిన విషయం గమనించిన దుండగులు.. ఆమెని బందింఛేందుకు ప్రయత్నించారు. కానీ.. లావణ్య వారికి దొరక్కుండా తీవ్రంగా ప్రతిఘటించింది. గట్టిగా కేకలు వేసింది. ఈ క్రమంలో వాళ్లు ఆమెపై కత్తితో దాడి చేశారు. అయినా లెక్క చేయకుండా.. వారిని ఎదుర్కొని, గదిలో నుంచి బయటకు వచ్చి, గట్టిగా కేకలు వేసింది. అత్త, మామ, బావ పడుకున్న గదికి గడియ వేయడంతో.. వాళ్లు బయటకు రాలేకపోయారు. అయితే.. లావణ్య అరుపులకు స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఈలోపే ఆ దుండగులు పారిపోయారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో 'బుల్లెట్ మోటార్ సైకిల్' ప్రాజెక్టు ఏర్పాటు..!
- Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
తీవ్ర గాయాలపాలైన లావణ్యను.. దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఈ కేసులో పోలీసులు కొన్ని అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇతర కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న గదికి బయటి నుంచి గడియ వేయడం, లావణ్య ఉన్న గదిలోకే దుండగులు రావడం, ఆమెపై కత్తితో దాడులు చేయడంతో.. ఎవరైనా కుట్ర పన్ని ఈ దాడికి పాల్పడ్డారా? అనే కోణంలో విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
Gautam Adani: అమెరికాలో అదానీ గెలిచాడు.. ఒక్క దెబ్బతో లీగల్ కేసులన్నీ క్లోజ్.. రూ.84 వేల కోట్ల ప్లాన్తో సరికొత్త చరిత్ర!
-
Suriya : సూర్య సాలిడ్ హిట్ కొట్టాడు.. ఆ హీరో కంబ్యాక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు
-
Janhvi Kapoor: కోలీవుడ్లో బంపర్ ఛాన్స్ ఆఫర్ కొట్టేసిన.. జాన్వీ
-
Pat Cummins-SRH: ఇట్స్ వెరీ టఫ్.. కానీ ఆ ఇద్దరి వల్లే గెలిచాం!
-
Sheikh Hasina: “నన్ను అంతం చేయడం మీ తరం కాదు! నేను మళ్లీ నా దేశానికి వస్తా.. నన్ను ఎవరూ ఆపలేరు”: షేక్ హసీనా
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!