40 Years Telugudesam Party: టీడీపీ అవసరమేంటో వివరించాలి
తెలుగు జాతి గౌరవాన్ని ఢిల్లీలో వెలుగెత్తి చాటిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. 40 నలభై వసంతాల తెలుగుదేశం ఆవిర్భావ వేడుకల లోగోను ఆవిష్కరించారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. టీడీపీ 40 ఏళ్లు పూర్తి చేసుకుని 41వ ఏడాదిలోకి అడుగుపెట్టబోతోంది. తెలుగుజాతి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు.. తెలుగు వారికి గుర్తింపు లేనప్పుడు టీడీపీ ఆవిర్భవించింది.
రూ. 2కే కిలో బియ్యం ద్వారా ఆహార భద్రత, పక్కా ఇళ్ల నిర్మాణం ద్వారా పేదలకు ఇళ్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ పథకాలే దేశవ్యాప్తంగా అమలు అవుతున్నాయి. శుభసూచికంగా ఉంటుందని పసుపు రంగును ఎన్నుకున్నారు. బీసీలకు రాజకీయ గుర్తింపు తెచ్చింది టీడీపీనే. టీడీపీ నలభై వసంతాల ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాం అన్నారు చంద్రబాబునాయుడు.
Also Read
- AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
- AP Weather Alert: ఏపీలో విభిన్న వాతావరణం.. ఓ వైపు 45.8°C ఎండలు.. మరోవైపు పిడుగులు..
- Off The Record : ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ సైలెంట్ వార్.. సొంత నేతలే చెక్ పెడుతున్నారా?
- Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిన ఏకైక ప్రాంతీయ పార్టీ టీడీపీనే. జాతీయ రాజకీయాల్లో కూడా టీడీపీ తనదైన ముద్ర వేసింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున గ్రామ గ్రామన టీడీపీ ఆవిర్భావ వేడుకలు.. జెండావిష్కరణ కార్యక్రమాలు చేపట్టాలి. పార్టీ కోసం పునరంకితం అయ్యేలా ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రానికి టీడీపీ అవసరమేంటో ప్రజలకు వివరించాలి. స్వర్గీయ నందమూరి తారకరామారావు హైదరాబాద్ లోని ఎమ్మెల్యేల క్వార్టర్సులో పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. ఎమ్మెల్యే క్వార్టర్సును సందర్శించి.. ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పిస్తాం. హైదరాబాద్ ఎన్టీఆర్ భవనులో కార్యక్రమాలు చేపడతాం. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులంతా వస్తారన్నారు చంద్రబాబు.
మద్యంపై సభలో చర్చ పెట్టరా..? రాష్ట్రంలో ఏ మద్యమైనా జగన్ కనుసన్నల్లోనే సరఫరా అవుతుంది. మద్యంలోని ప్రిమీయం బ్రాండ్లు ఏపీలో కన్పించకుండా పోయాయి. కిళ్లీ కొట్టులో కూడా ఆన్ లైన్ పేమెంట్లు ఉంటే.. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఆన్ లైన్ పేమెంట్లు ఉండవా..? మద్యం విషయాన్ని మేం అంత తేలిగ్గా వదిలిపెట్టం. 42 మంది చనిపోతే సహజ మరణాలుగా చిత్రీకరిస్తారా..? మద్యం విషయంలో సీఎం జగన్ దోపిడీ ఏ స్థాయిలో ఉందో మా ఎమ్మెల్యేలు వివరించారు. దీనిపై ప్రజల్లోకి వెళ్తాం అన్నారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!