40 Years Telugudesam Party: టీడీపీ అవసరమేంటో వివరించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు జాతి గౌరవాన్ని ఢిల్లీలో వెలుగెత్తి చాటిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. 40 నలభై వసంతాల తెలుగుదేశం ఆవిర్భావ వేడుకల లోగోను ఆవిష్కరించారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. టీడీపీ 40 ఏళ్లు పూర్తి చేసుకుని 41వ ఏడాదిలోకి అడుగుపెట్టబోతోంది. తెలుగుజాతి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు.. తెలుగు వారికి గుర్తింపు లేనప్పుడు టీడీపీ ఆవిర్భవించింది.
రూ. 2కే కిలో బియ్యం ద్వారా ఆహార భద్రత, పక్కా ఇళ్ల నిర్మాణం ద్వారా పేదలకు ఇళ్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ పథకాలే దేశవ్యాప్తంగా అమలు అవుతున్నాయి. శుభసూచికంగా ఉంటుందని పసుపు రంగును ఎన్నుకున్నారు. బీసీలకు రాజకీయ గుర్తింపు తెచ్చింది టీడీపీనే. టీడీపీ నలభై వసంతాల ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాం అన్నారు చంద్రబాబునాయుడు.
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- OTR: మేయర్ సీటుపై కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య కోల్డ్ వార్
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై సమగ్ర అధ్యయనం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- OTR : గంటా గేమ్ మారిందా..? భీమిలి సీటు వదులుకునేందుకు సిద్ధమా..?
పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిన ఏకైక ప్రాంతీయ పార్టీ టీడీపీనే. జాతీయ రాజకీయాల్లో కూడా టీడీపీ తనదైన ముద్ర వేసింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున గ్రామ గ్రామన టీడీపీ ఆవిర్భావ వేడుకలు.. జెండావిష్కరణ కార్యక్రమాలు చేపట్టాలి. పార్టీ కోసం పునరంకితం అయ్యేలా ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రానికి టీడీపీ అవసరమేంటో ప్రజలకు వివరించాలి. స్వర్గీయ నందమూరి తారకరామారావు హైదరాబాద్ లోని ఎమ్మెల్యేల క్వార్టర్సులో పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. ఎమ్మెల్యే క్వార్టర్సును సందర్శించి.. ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పిస్తాం. హైదరాబాద్ ఎన్టీఆర్ భవనులో కార్యక్రమాలు చేపడతాం. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులంతా వస్తారన్నారు చంద్రబాబు.
మద్యంపై సభలో చర్చ పెట్టరా..? రాష్ట్రంలో ఏ మద్యమైనా జగన్ కనుసన్నల్లోనే సరఫరా అవుతుంది. మద్యంలోని ప్రిమీయం బ్రాండ్లు ఏపీలో కన్పించకుండా పోయాయి. కిళ్లీ కొట్టులో కూడా ఆన్ లైన్ పేమెంట్లు ఉంటే.. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఆన్ లైన్ పేమెంట్లు ఉండవా..? మద్యం విషయాన్ని మేం అంత తేలిగ్గా వదిలిపెట్టం. 42 మంది చనిపోతే సహజ మరణాలుగా చిత్రీకరిస్తారా..? మద్యం విషయంలో సీఎం జగన్ దోపిడీ ఏ స్థాయిలో ఉందో మా ఎమ్మెల్యేలు వివరించారు. దీనిపై ప్రజల్లోకి వెళ్తాం అన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!