NTV Telugu Site icon

Andhra Pradesh: ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 11 కొత్త కోర్సులు

Students Min

Students Min

ఏపీలోని విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 20 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలలో ఈ విద్యా సంవత్సరం నుంచి అప్రెంటీస్‌షిప్‌తో కూడిన 11 కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు సెక్టార్ స్కిల్స్ కౌన్సిల్స్, కళాశాల విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో కొత్త కోర్సులను ప్రారంభిస్తున్నట్లు కమిషనర్ పోలా భాస్కర్ వెల్లడించారు. కొత్త కోర్సులలో బీఏ టూరిజం, హాస్పిటాలిటీ బీబీఏ, హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్, బీబీఏ లాజిస్టిక్స్, బీబీఏ డిజిటల్ మార్కెటింగ్, బీబీఏ రిటైల్ ఆపరేషన్స్, బీఎస్సీ గేమింగ్ లాంటివి ఉన్నాయి.

16 అటానమస్ కాలేజీలతో పాటు మరో నాలుగు సాధారణ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఈ కోర్సులు అందుబాటులోకి వస్తాయని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ కోర్సులు చదివే వారికి పరిశ్రమల్లో అప్రెంటీస్‌షిప్ ఉంటుందన్నారు. దీనికి ప్రభుత్వం ప్రత్యేకంగా సర్టిఫికెట్ ఇస్తుందని తెలిపారు. అప్రెంటీస్‌షిప్ చేసే సమయంలో నెలకు రూ.7వేల నుంచి రూ.15 వేల వేతనం లభిస్తుందని పేర్కొన్నారు. అన్ని కోర్సుల్లోనూ ప్రాథమికంగా 30 సీట్ల చొప్పున ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. కాగా ఆరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో బ్యూటీ, వెల్‌నెస్ సర్టిఫికెట్ కోర్సును నిర్వహిస్తున్నారు.

Ap Highcourt: కోర్టు ధిక్కార కేసులో IASలపై హైకోర్టు సీరియస్‌