తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనానికి భక్తులు 16 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. మరోవైపు.. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. అలాగే నిన్న (సోమవారం) అర్ధరాత్రి వరకు 71,824 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 28,462 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. స్వామి వారి హుండి ఆదాయం 4.01 కోట్లు వచ్చినట్లుగా అధికారులు తెలిపారు.
Read Also: OnePlus Nord CE4 Lite 5G Price: ‘వన్ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్’ టాప్-10 ఫీచర్స్ ఇవే!
మరోవైపు.. ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లు కలిగిన భక్తులు 4 గంటల్లో స్వామివారిని దర్శించుకుంటున్నారు. టైమ్ స్లాట్ దర్శనానికి 6 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. దర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. ఉచిత సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతుంది.
Read Also: Deepika Padukone: ఇది అస్సలు ఊహించలేదు భయ్యా.. ఫ్యాన్స్ హర్ట్ అవుతారు..