Site icon NTV Telugu

40 ఏళ్ళ‌నాటి కేకు… భారీ ధ‌ర‌కు అమ్మ‌కం…

మాములుగా కేకు ధ‌ర‌లు అందులో వినియోగించే ప‌దార్ధాల‌ను బ‌ట్టి ఉంటుంది.  ఎంత ఖ‌రీదుపెట్టి కొనుగోలు చేసినా రెండు మూడు రోజుల‌కు మించి ఉండ‌దు.  కానీ, ఆ కేకు 40 ఏళ్ల క్రితం నాటిది.  పైగా రాజ‌కుటుంబం పెళ్లి స‌మ‌యంలో క‌ట్ చేసిన కేకు కావడంతో వేలంలో భారీ ధ‌ర‌కు అమ్ముడు పోయింది.  1981 జులై 29 వ తేదీన బ్రిట‌న్ యువ‌రాజు చార్లెస్‌-డయానాలు పెళ్లిజ‌రిగిన రోజు.  ఆ రోజున ఈ కేకును క‌ట్ చేసి అంద‌రికి పంచారు.  మొత్తం 23 కేకులు క‌ట్ చేయ‌గా అందులో ఒక‌టి వారిద‌గ్గ‌ర ప‌నిచేస్తున్న యోయాస్మిత్ అనే మ‌హిళ‌కు ఇచ్చారు.  ఆమె ఆ కేకును భ‌ద్రంగా దాచుకుంది.  2008లో ఆ కేకును ఓ క‌లెక్ట‌ర్‌కు అమ్మారు.  కాగా, అలా అప్పుడు అమ్మిన ఆ కేకు ఇప్పుడు వేలానికి వ‌చ్చింది.  ఈ వేలంలో గ్యారీ అనే వ్య‌క్తి రెండు ల‌క్ష‌ల రూపాయ‌లకు ఈ కేకును కొనుగోలు చేశాడు.  

Read: తాలిబ‌న్ల‌తో సంధికి ఆఫ్ఘ‌న్ ప్రభుత్వం కీలక ప్ర‌తిపాద‌న‌లు…

Exit mobile version