కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వెహికిల్ స్క్రాపేజ్ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ ప్రకారం గడువు తీరిన వాహనాలను తుక్కుగా మార్చేస్తారు. ఇలా స్క్రాప్ను తిరిగి వినియోగించే విధంగా మార్చేస్తుంటారు. గడువు తీరిన వాహనాలు బయట రోడ్లపై తిరుగుతుండటం వలన కాలుష్యం పెరుగుతుంది. ప్రమాదాలు జరుగుతుంటాయి. అందుకే కేంద్రం ఈ పాలసీని అమల్లోకి తెచ్చింది. వ్యక్తిగత వాహనాలకు 15 ఏళ్ల పరిమితి ఉంటే, వాణిజ్యవాహనాలకు పదేళ్ల పరిమితి ఉంటుంది. అయితే, పదేళ్ల తరువాత మరోసారి వీటికి ఫిట్నెస్ టెస్ట్ నిర్వహిస్తారు. ఒకవేళ ఈ టెస్టులో పాస్ అయితే మరో ఐదేళ్లపాటు వాహనాలు నడిపేందుకు అవకాశం ఉంటుంది. వద్దు అనుకుంటే వాటిని ప్రభుత్వం స్క్రాప్కు పంపుతుంది. అంతేకాదు, స్క్రాప్కు ఇవ్వాలని అనుకున్న వాహనాలకు ఎక్స్ షోరూమ్ ధరప్రకారం 4 నుంచి 6 శాతం వరకు ప్రొత్సాహకాలు ఉంటాయి. రోడ్డు పన్ను నుంచి 25శాతం, వాణిజ్యవాహనాల కోనుగోలు నుంచి 15 శాతం రాయితీ లభిస్తుంది.
వెహికల్ స్క్రాపేజ్ పాలసీ వలన ఎవరికి లాభం…
