Site icon NTV Telugu

దళితబంధుపై ముగిసిన వాదనలు..తీర్పు రిజర్వ్‌

దళిత బంధు పిటిషన్ పై హైకోర్టు లో వాదనలు ముగిశాయి. తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. దళిత బంధును ఎన్నికల సంఘం ఆపడానికి సవాల్ చేస్తూ నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకం అమలవుతుందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఒక్క హుజురాబాద్ లోనే దళిత బంధు పథకం అమలు కావడం లేదన్నారు పిటీషనర్లు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఆమలవుతుందని కోర్టుకు తెలిపారు పిటిషనర్లు.

కేంద్ర ప్రభుత్వం మహిళా పోషన్ అభియాన్ కొనసాగించే విధంగానే దళిత బంధు పథకాన్ని కూడా కొనసాగించాలని కోర్టుని కోరారు పిటిషనర్లు. దళిత బంధు పథకాన్ని ఆపడం వలన చాలామంది వెనుకబడిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాంటివారు ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు.

రాష్ట్రంలో అమలవుతున్న దళిత బంధు పథకాన్ని ఇప్పుడు ఎన్నికల సంఘం ఆపడం సరైంది కాదని వాదించారు. వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేసిన దళిత బంధు పథకాన్ని అమలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని వారు కోరారు. ఈ పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రీజర్వ్ చేసింది హైకోర్టు.

Exit mobile version