NTV Telugu Site icon

అది గోల్డెన్ ఐలాండ్‌… ఆ దీవిలోకి అడుగుపెడితే…

అన‌గ‌న‌గా ఓ దీవి ఆ దీవిలో అనంత సంప‌ద‌. ఆ సంప‌ద‌ను చేజిక్కించుకోవ‌డానికి వేలాది మంది ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నం చేస్తున్నారు.  కానీ ఎవ‌రూ ఆ దీవిలోకి అడుగుపెట్ట‌లేక‌పోయారు.  ఆ దీవిలోకి వెళ్లాలి అంటే ప్రాణాలపై ఆశ‌లు వ‌దిలేసుకోవాల్సిందే..  వెళ్లినా అక్క‌డ సంప‌ద దొరుకుతుంద‌ని గ్యారెంటీ లేదు.  ఎవ‌రికి అదృష్టం ఉంటుందో వారికి మాత్ర‌మే ఆ నిధి దొరికే అవ‌కాశం ఉంటుంది.  ఆ దీవిపేరు పాలెంబాగ్ దీవి.  ఇది ఇండోనేషియాలోని పాలెంబాగ్ న‌దిలో ఉన్న‌ది. ఇది ర‌హ‌స్య‌దీవి.  అక్క‌డి వెళ్ల‌డం సామాన్యుల‌కు సాధ్యం కాదు.  న‌దిలో వేల సంఖ్య‌లో మొసళ్లు తిరుగుతుంటాయి.  ఏమ‌రుపాటుగా ఉంటే వాటికి ఆహారంగా మారిపోవాల్సిందే.  ఇలా ఎంద‌రో ప్రాణాలు పోగొట్టుకున్నారు.  

Read: అఖిలేష్ యాద‌వ్ సంచ‌ల‌న నిర్ణ‌యం: 2022 ఎన్నిక‌ల్లో…

చాలా మంది ఆ గోల్డెన్ దీవి కోసం, అందులోని అంతులేని సంప‌ద కోసం ప్ర‌య‌త్నించి వెనుదిరిగారు.  మ‌త్స్య‌కారులు సైతం ఆ దీవి కోసం అన్వేషించారు.  కాని దొర‌కలేదు.  ప‌ట్టువ‌ద‌ల‌కుండా ఐదేళ్ల నుంచి ప్రాణాల‌కు తెగించి దీవి కోసం అన్వేష‌ణ సాగించ‌గా ఎట్ట‌కేల‌కు నిథి ఉన్న‌దీవి బ‌య‌ట‌ప‌డింది.  ఆ దీవిని చూసిన మ‌త్స్యకారులు ఆశ్చ‌ర్య‌పోయారు.  అందులో అంతులేని సంప‌ద ఉన్న‌ది.  బంగారం, వ‌జ్రాలు, వైఢూర్యాలు, బుద్ధ‌విగ్రహం వంటివి అనేకం ఉన్నాయి.  మ‌త్స్య‌కారుల‌కు దొరికిన బుద్ధుని విగ్ర‌హం ఆధారంగా ఆ సంప‌ద శ్రీ విజ‌య కాలానికి చెందిన‌దిగా అంచ‌నా వేస్తున్నారు.  ఒక్క బుద్ద‌విగ్రహం ఖ‌రీదు మిలియ‌న్ డాల‌ర్లు ఉంటుంద‌ని చెబుతున్నారు.