NTV Telugu Site icon

హైదరాబాద్ వాసులకు అలర్ట్ : ట్యాంక్‌బండ్‌ పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు

ట్యాంక్‌ బండ్‌ పై నగర ప్రజల ఎంజాయ్‌ మెంట్‌ కోసం ట్రాఫిక్‌ లేకుండా ఆదేశాలు జారీ చేశారు అధికారులు. దీంతో ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటలకు ఎలాంటి వాహానాలు ప్రయాణించకుండా ఆంక్షలు విధించారు. నగర ప్రజల కోసం ట్యాంక్‌ బండ్‌ సరికొత్త రూపుదిద్దుకుంది. అయితే… సాయంత్రపు వేళ అక్కడ విహరించాలంటే.. ట్రాఫిక్‌ రణవేళ మధ్య కొంత కష్టంగా మారింది. దీంతో ఓ నెటిజన్‌ మంత్రి కేటీఆర్‌కు సాయంత్రపు వేళ ట్యాంక్‌ బండ్‌ పై ట్రాఫిక్‌ ను కంట్రోల్‌ చేయాలని ట్వీట్‌ చేశాడు. అయితే… ఆ ట్వీట్‌ పై స్పందించిన మంత్రి కేటీఆర్‌.. సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ట్యాంక్‌ బండ్‌ పై ప్రతి ఆదివారం సాయంత్రం నుంచే పెడ్రస్టియన్‌ జోన్‌గా మారుస్తున్నారు. ఆదివారం రోజుల్లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటలకు ఎలాంటి వాహానాలు ప్రయాణించకుండా ఆంక్షలు విధించారు. ఇందులో ఇవాళ కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఆ సమయంలో ట్యాంక్‌ బండ్‌ మీదుగా ప్రయాణించాల్సిన వాహనాలను మళ్లించనున్నారు పోలీస్‌ అధికారులు.