ఏపీలో మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం అంటూ మహాపాదయాత్ర చేస్తున్నారు. 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ పాదయాత్ర నవంబర్ 1 తేదిన ప్రారంభించారు. డిసెంబర్ 15న తిరుమలకు చేరుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వర్షాల్లో ఇబ్బందులు పడుతూ పాదయాత్ర చేస్తున్న రైతులు ప్రకాశం జిల్లాకు చేరుకున్నారు. భారీ వర్షాలతో పాదయాత్ర మార్గంలో వాగులు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో అమరావతి రైతుల జేఏసీ నిన్న విరామం ప్రకటించింది. ఈ రోజు కూడా వర్ష ప్రభావం తగ్గకపోవడంతో నేడు కూడా పాదయాత్రకు విరామం ప్రకటించారు. పాదయాత్రలో పాల్గొన్న మహిళలు ఇబ్బందులు పడకూడదనే పాదయాత్రకు విరామం ఇస్తున్నట్లు జేఏసీ తెలిపింది. రేపు గుడ్లూరు నుంచి పాదయాత్ర ప్రారంభించాస్తామని జేఏసీ వెల్లడించింది.
మరోసారి రాజధాని రైతుల పాదయాత్రకు బ్రేక్
