నిన్న పరిషత్ ఎన్నికల కౌంటింగ్ జరిగింది. సాధారణంగా బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగే ఎన్నికల్లో కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి. కొంతమంది ఓటర్లు తమ డిమాండ్లను ఓ స్లిప్ పై రాసి బ్యాలెట్ బాక్సుల్లో వేస్తుంటాయి. ఇలాంటి విచిత్రమైన సంఘటన ఒకటి అనంతపురం జిల్లాలోని నల్లచెరువులో జరిగింది. నల్లచెరువు మండలంలోని ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఓట్లను లెక్కిస్తుండగా అధికారులకు బ్యాలెట్ బాక్సులో ఓ స్లిప్ దొరికింది. నల్లచెరువు మద్యం దుకాణాల్లో చల్లని బీరును ఉంచాలని, అదే విధంగా మంచి బ్రాండు బీరును అందుబాటులో ఉంచాలని చెప్పి రాసుంది. నల్లచెరువు మందుబాబుల సంఘం పేరుతో ఈ లెటర్ ఉండటంతో అధికారులు షాక్ అయ్యారు. వెంటనే ఆ లెటర్ను వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్గా మారింది.
Read: కాబూల్లో రోడ్డెక్కిన మహిళా ఉద్యోగులు…