Site icon NTV Telugu

ఎస్‌బీఐ ఖాతాదారులకు గమనిక.. నిలిచిపోనున్న ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు

దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) ఇంటర్నెట్‌ బ్యాంకింగ్ సేవలకు శనివారం అర్ధరాత్రి కొద్ది గంటల పాటు అంతరాయం ఏర్పడనుంది. ఈ సమయంలో ఎస్‌బీఐ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలతో పాటు యోనో, యోనో లైట్‌, యూపీఐ సేవలు సైతం నిలిచిపోతాయని ఎస్‌బీఐ తెలిపింది. శనివారం రాత్రి 11.30 గంటల నుంచి ఆదివారం వేకువ జామున 4:30 వరకు ఈ సేవలు నిలిచిపోనున్నట్లు ఎస్‌బీఐ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో వెల్లడించింది.

Read Also: మ‌రోసారి పెరిగిన బంగారం ధ‌ర‌లు

సాంకేతిక అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియలో భాగంగా సేవలకు అంతరాయం ఏర్పడుతోందని ఎస్‌బీఐ పేర్కొంది. మెరుగైన బ్యాంకింగ్‌ సేవలు అందించే ఈ ప్రయత్నంలో కలుగుతున్న ఈ అసౌకర్యానికి సహకరించాలని ఖాతాదారులను ఎస్‌బీఐ కోరింది. ఇటీవల అక్టోబర్ నెలలోనూ ఇదే తరహాలో మెయింటెనెన్స్ ప‌నుల్లో భాగంగా ఎస్‌బీఐ ఇంట‌ర్నెట్ సేవ‌ల‌కు అంత‌రాయం ఏర్పడింది. కాగా దేశవ్యాప్తంగా ఎస్‌బీఐకి 22వేల బ్యాంక్‌ శాఖలు, 57,889 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి.

Exit mobile version