Site icon NTV Telugu

హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంపై రాజ్‌నాథ్ సింగ్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

తమిళనాడు రాష్ట్రంలో నిన్న ఆర్మీ హెలికాప్టర్ క్రాష్ అయి… బిపిన్ రావత్ దంపతులతో సహా మొత్తం 13 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. అయితే ఈ హెలికాప్టర్ ప్రమాదం పై… లోక్ సభలో… కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. సుల్లూరు ఎయిర్ బేస్ నుంచి నిన్న.. ఉదయం 11:48 గంటలకు హెలి కాప్టర్ టేకాఫ్ అయిందన్నారు.

మధ్యాహ్నం 12:15 గంటలకు వెల్లింగ్టన్ లో ల్యాండ్ కావాల్సి ఉందని ఆయన తెలిపారు. కానీ మధ్యాహ్నం 12:08 గంటలకు సుల్లూరు ఏటీపీ విమానానికి కాంటాక్ట్ తెగిపోయిందని రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేశారు. ఈ ప్రమాద ఘటనలో 13 మంది దుర్మరణం చెందారు అని ఆవేదన వ్యక్తం చేశారు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. హెలికాప్టర్ కూలిపోవ‌డాన్ని అక్క‌డే ఉన్న‌ స్థానికులు గమనించారని.. హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ ప్రారంభమైందనీ ప్రకటించారు రాజ్ నాథ్ సింగ్.

Exit mobile version