Site icon NTV Telugu

ఐపీఎల్ 2021 : సన్ రైజర్స్ ముందు స్వల్ప లక్ష్యం…

ఐపీఎల్ 2021 లో ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ ముగిసింది. అయితే హైదరాబాద్ కట్టుదిట్టమైన బౌలింగ్ కు పంజాబ్ బ్యాటింగ్ కుప్పకూలిపోయింది. నిర్ణిత 20 ఓవర్లలో పంజాబ్ 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసింది. టాప్ క్లాస్ బ్యాట్స్మెన్స్ ఉన్న పంజాబ్ జట్టులో ఎవరు చెప్పుదగ్గ ప్రదర్శన చేయలేదు. ఆ జట్టులో ఐడెన్ మార్క్రమ్(27) అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక సన్ రైజర్స్ బౌలర్లలో జాసన్ హోల్డర్ మూడు వికెట్లు తీయగా అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. అయితే ఈ మ్యాచ్ లో గెలవడానికి సన్ రైజర్స్ 126 పరుగుల స్వల్ప లక్ష్యమే ఉంది. కానీ గత మ్యాచ్ లలో ఆ జట్టు చేసిన ప్రదర్శతో పోల్చితే ఇదే వారికీ కొంత కష్టమైన లక్ష్యమే. చూడాలి మరి హైదరాబాద్ ఆటగాళ్లు ఈ మ్యాచ్ లో గెలిచి మళ్ళీ రైజ్ అవుతారా.. లేదా అనేది.

Exit mobile version