NTV Telugu Site icon

ఏపీలో పెరుగుతున్న పాజిటివిటి రేటు… సంపూర్ణ లాక్ డౌన్ తప్పదా? 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో రాష్ట్రంలో ప్రస్తుతం కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే.  మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలులో ఉంటుంది.  అయితే, ప్రతిరోజు భారీగా కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  


అనంతపురం జిల్లాలో నిన్నటి రోజున కేసులు 3 వేలకు పైగా నమోదయ్యాయి.  మొదటిసారి కేసులు 3 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.  రాష్ట్రంలో పాజిటివిటి రేటు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయబోతుందా అంటే అవుననే విధంగా ఉన్నాయి ప్రస్తుతం గణాంకాలు.  కేసులు ఇదే విధంగా పెరిగితే లాక్ డౌన్ విధించక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  మరోవైపు మరణాల రేటు కూడా రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్నది. నిన్నటి రోజున రాష్ట్రంలో 101 మరణాలు నమోదైన సంగతి తెలిసిందే.