టాలివుడ్ ప్రముఖ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గ్యాప్ తర్వాత పెద కాపు టైటిల్ తో ఓ డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలసిందే. కొత్త నటీనటులతో ఆయన చేస్తున్న ప్రయోగం గురించి ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే..విరాట్ కర్ణని హీరోగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ తెరపైకి తీసుకురాబోతున్న సినిమా పెద కాపు-1. ఈ సినిమా పోస్టర్,టీజర్,ట్రైలర్ రిలీజైనప్పటినుంచి అంచనాలు మొదలయ్యాయి. తప్పకుండా ఈసారి శ్రీకాంత్ విభిన్నమైన కథాంశంతో రానున్నాడు అనిపిస్తోంది. కానీ సినిమాకు అనుకున్నంత స్థాయిలో టాక్ ను అందుకోలేక పోయింది..
మొన్నీమధ్య విడుదలైన ట్రైలర్ ఓ మాదిరిగా ఆకట్టుకున్న ప్రేక్షకుల్లో బజ్ ను క్రియేట్ చెయ్యలేదు.. ఈ నేపథ్యంలో రిలీజ్ పంక్షన్ ని భారీగా ప్లాన్ చేసారు. పెదకాపు ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 23న సాయంత్రం 6 గంటలకు హెదరాబాద్ లో హైటెక్ సిటీ శిల్పకళావేదిక లో జరుపుతున్నట్టు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసారు. అయితే ఈ ఈవెంట్ కి గెస్ట్ ఎవరు వస్తున్నారో అనేది మాత్రం బయిటకు రాలేదు.. కానీ నందమూరి హీరో బాలకృష్ణ ముఖ్య అతిధిగా రానున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి..
బాలయ్య కి చాలా రోజుల తర్వాత అఖండ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బ్యానర్ కాబట్టి, ఆ సాన్నిహిత్యం తో బాలయ్య ఖచ్చితంగా రావొచ్చని అంటున్నారు. అయితే ఆయన పొలిటికల్ హడావిడిలో ఉన్నారు. అక్కడ ఖాళీ చేసుకుని రావాల్సి ఉంటుంది.. ఇకపోతే ఈ సినిమాలో శ్రీకాంత్ అడ్డాల ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ కథను చాలా సెన్సిటివ్ ఎలిమెంట్స్ తో తెరపైకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ద్వారకా క్రియేషన్స్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగతి శ్రీ వాస్తవ హీరోయిన్ గా నటిస్తోంది…