Site icon NTV Telugu

కిమ్‌పై ఆ దేశ ఎన్ఐఎస్ కీల‌క వ్యాఖ్య‌లు…

ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జంగ్ ఉన్ కు సంబంధించి ఎలాంటి న్యూస్ అయినా సోష‌ల్ మీడియాలో హైలైట్ అవుతుంది.  గ‌త కొన్ని నెల‌లుగా కిమ్ అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారని, అందుకే మీడియాలో ఆయ‌న క‌నిపించ‌డం లేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.  ఈ వార్త‌ల‌ను నార్త్ కొరియా అధికారులు ఖండిస్తూ వ‌స్తున్నారు.  అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా కిమ్ స‌న్న‌బ‌డిపోయార‌ని వార్త‌లు వస్తున్న నేప‌థ్యంలో ఆ దేశానికి చెందిన ది నేష‌న‌ల్ ఇంటిలిజెన్స్ స‌ర్వీసెస్ ఏజెన్సీ కీల‌క వివ‌రాల‌ను వెల్ల‌డించింది.  కిమ్ త‌న దేహ‌దారుడ్యాన్ని మెరుగుప‌రుచుకుంటున్నార‌ని, ఇందులో భాగంగానే ఆయ‌న స‌న్న‌బ‌డ్డార‌ని, 20 కిలోల వ‌ర‌కు బ‌రువు త‌గ్గార‌ని ఎన్ఐఎస్ ఆ దేశ చ‌ట్ట‌స‌భ‌ల‌కు తెలియ‌జేసింది.  2019లో కిమ్ 140 కిలోల బ‌రువు ఉండ‌గా, ఇప్పుడు 20 కేజీల బ‌రువు త‌గ్గిన‌ట్టు ఎన్ఐఎస్ తెలియ‌జేసింది. 

Read: మ్యాన్‌హోల్‌పై పిల్లల ప్ర‌యోగం… తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం…

Exit mobile version