గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ దేశాలతో పాటు భారత్ను పట్టిపీడిస్తున్న కరోనా మహ్మారి బెడద ఇంకా తగ్గడం లేదు. తాజాగా దేశవ్యాప్తంగా కొత్తగా 6,531 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా దేశంలో కరోనా నుండి గడిచిన 24 గంటల్లో మరో 7,141 మంది కోలుకొని ఆసుప్రతి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 75,841 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉంటే ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ భారత్లోని పలు రాష్టాల్లో దాని ప్రభావం చూపుతోంది. తాజాగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 578కి చేరింది. దేశంలో ఎక్కువ ఢిల్లీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 142 ఉండగా, మహారాష్ట్రలో 141 కేసులు ఉన్నాయి. వీటితో పాటు పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూను విధించాయి. దేశ రాజధానిలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.
