NTV Telugu Site icon

శ‌బ‌రిమ‌ల యాత్ర‌: కేర‌ళ ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శకాలు…

ప్ర‌తి ఏడాది శ‌బ‌ర‌మ‌ల యాత్ర‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తారు.  శ‌బ‌రిమ‌ల యాత్ర‌కు ల‌క్ష‌లాది మంది భ‌క్తులు శ‌బ‌రిమ‌ల వెళ్తుంటారు.  అయితే, క‌రోనా కార‌ణంగా గ‌తేడాది ఈ యాత్ర‌ను ప‌రిమిత సంఖ్య‌కే ప‌రిమితం చేశారు.  కాగా, ఈ ఏడాది న‌వంబ‌ర్ 16 నుంచి తిరిగి శ‌బ‌రిమ‌ల యాత్ర ప్రారంభం అవుతుంది.  ఈ నేప‌థ్యంలో కేర‌ళ ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శాక‌లు రిలీజ్ చేసింది.  రోజుకు 25 వేల మంది భ‌క్తులు అయ్య‌ప్ప‌ను ద‌ర్శ‌నం  చేసుకునేందుకు వీటుగా ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.  రెండు టీకాలు వేయించుకున్న‌వారు లేదంటే ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో నెగెటివ్ వ‌చ్చిన భ‌క్తుల‌కు మాత్ర‌మే ఆల‌యంలోకి అనుమ‌తించాల‌ని నిర్ణ‌యించారు.  ద‌ర్శ‌నం అనంత‌రం సన్నిధానంలో ఎవ‌రూ ఉండ‌కుండా తిరిగి వెళ్లిపోయేలా ఎర్పాట్లు చేస్తున్నారు.  ఇక గ‌త సంవ‌త్స‌రం లాగానే యాత్రికుల‌ను ఎరుమేలి మీదుగా అట‌వీ మార్గంలో పుల్మేడు మీదుగా స‌న్నిధానానికి అనుమ‌తించ‌కూడ‌ద‌ని స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. నీల‌క్క‌ల్ నుంచి భ‌క్తులు కేర‌ళ ప్ర‌భుత్వ ఆర్టీసీ బ‌స్సుల‌ను ఉప‌యోగించుకోవాల్సి ఉంటుంది.  ఇక ఆరోగ్య స‌మ‌స్యలు ఉన్న భ‌క్తులు కోవిడ్ ప‌రీక్ష‌ల త‌రువాతే శ‌బ‌రిమ‌ల యాత్ర‌కు రావాల‌ని ఆదేశించారు.  స్మోక్ డిటెక్ట‌ర్ల‌ను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం అధికారుల‌ను ఆదేశించింది.  

Read: క‌రెంట్ క‌ష్టాలు: రైల్వే స్టేష‌న్‌లోనే విద్యార్థుల చ‌దువులు… ఆ పరీక్ష‌ల కోస‌మే…