Site icon NTV Telugu

ప్రగతి భవన్ చేరుకున్న కేసీఆర్‌.. ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చ..

తెలంగాణలో ఎమ్మెల్యే, గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ తమ ఎమ్మెల్యే అభ్యర్థులపై కసరత్తు మొదలుపెట్టింది. ఈ క్రమంలో ప్రగతి భవన్‌కు సీఎం, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చేరుకోనున్నారు.

ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనపై చర్చించి ఈ రోజు రాత్రికి లేదా రేపు ఉదయం ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో ఆరు, గవర్నర్ కోటా లో ఒకటి ఖాళీ ఉంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ కు ఎల్లుండి ఆఖరు రోజు.

Exit mobile version