దక్షిణాఫ్రికా దేశంలో పురుడు పోసుకున్న ఒమిక్రాన్ వేరియంట్…చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ కొత్త వేరియంట్.. 89 దేశాలకు పైగా పాకేసింది. ఇటు మన ఇండియాలోనూ… ఒమిక్రాన్ మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా మన దేశంలో ఒమిక్రాన్ కేసులు…200 కు చేరుకున్నాయి.
మహారాష్ట్రలో 54 ఒమిక్రాన్ కేసులు, ఢిల్లీలో 54, తెలంగాణలో 20, కర్నాటకలో 19, రాజస్థాన్లో 18, కేరళలో 15, గుజరాత్ 14, గుజరాత్లో 14, యూపీలో 2 కేసులు నమోదయ్యాయి. అయితే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గడ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఒక్కో ఒమిక్రాన్ కేసు నమోదు కావడం గమనార్హం. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 200 దాటడంతో కేంద్రం అప్రమత్తమైంది.
