NTV Telugu Site icon

ఇండియాలో కొత్త‌గా 9419 క‌రోనా కేసులు, 159 మ‌ర‌ణాలు

ఇండియాలో క‌రోనా కేసులు సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం.… గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో కొత్త‌గా 9419 క‌రోనా కేసులు, 159 మ‌ర‌ణాలు న‌మోదు అయ్యాయి. ఇక ఇప్పటి వ‌ర‌కు దేశంలో 94,742 కేసులు యాక్టీవ్‌ గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 159 మంది మృతి చెందారు.

ఇక గడిచిన 24 గంటల్లో 8,251 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో భార‌త్‌లో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 4,74,111 మంది క‌రోనాతో మ‌ర‌ణించిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఇక దేశంలో ఇప్పటి వరకు నమోదు అయిన కరోనా కేసుల సంఖ్య 3,46,66,241 గా నమోదు అయింది. మరోవైపు ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 1,30,39,32,286 మందికి టీకాలు వేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది.