NTV Telugu Site icon

ఇండియాలో భారీగా త‌గ్గిన క‌రోనా .. కొత్త‌గా 6,822 కేసులు

ఇండియాలో క‌రోనా కేసుల సంఖ్య ఇవాళ కాస్త త‌గ్గింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం.… గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో కొత్తగా 6,822 కేసులు న‌మోద‌య్యాయి. ఇక ఇప్పటి వ‌ర‌కు దేశంలో 95,014కేసులు యాక్టీవ్‌ గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 220 మంది మృతి చెందారు.

ఇక గడిచిన 24 గంటల్లో 10,004 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో భార‌త్‌లో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 4,73,757 మంది క‌రోనాతో మ‌ర‌ణించిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఇక దేశంలో ఇప్పటి వరకు నమోదు అయిన కరోనా కేసుల సంఖ్య 3,46,48,383 గా నమోదు అయింది. మరోవైపు ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 1,28,76,10,590 మందికి టీకాలు వేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది.