NTV Telugu Site icon

రఫ్పాడిస్తున్న ఈటల : నాలుగో రౌండ్‌లో బీజేపీ ముందజ

హుజురాబాద్‌ గడ్డమీద తన అధిక్యతను ఈటల రాజేందర్‌ చాటుతున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభంలో పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లలో వెనుకంజలో ఉన్నా… ఈవీఏంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల లీడ్‌లో ఉన్నారు. తొలి రౌండ్‌లో 166, రెండవ రౌండ్‌లో 192, మూడవ రౌండ్‌లో 911 ఓట్ల ఆధిక్యతను సాధించారు.

మూడవ రౌండ్‌ ముగిసిన సరికి బీజేపీ మొత్తం 13,525 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్‌కు 12,252 ఓట్లు, కాంగ్రెస్‌కు 466 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం నాల్గవ రౌండ్‌లోనూ ఆధిక్యతతో ముందం

జలో ఉన్నారు. నాలుగో రౌండ్‌ ముగిసే సరిగి 1,825 ఓట్ల లీడ్‌లో ఉండగా.. మొత్తంగా బీజేపీకి 17,838 ఓట్లు , టీఆర్‌ఎస్‌కు 16,134 ఓట్లు వచ్చాయి. హుజురాబాద్‌, వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, కమలాపూర్ మండలాల వారీగా ఓట్లను లెక్కిస్తున్నారు.