మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో చిరుతలు సందడి చేస్తున్నాయి. అయితే, పార్క్ నుండి కొన్ని ఆఫ్రికన్ చిరుతలను తరలించడానికి మరొక ఆవాసాన్ని గుర్తించాలని దేశంలోని అపెక్స్ వన్యప్రాణుల నిర్వహణ సంస్థను కోరుతూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA)కి లేఖ రాసింది. కునో నేషనల్ పార్క్ నుంచి నమీబియా నుంచి తీసుకొచ్చిన ఓ చిరుత తప్పించుకుంది. రక్షణ ప్రాంతం నుంచి బయటకొచ్చిన ఒబాన్ అనే చిరుత.. అనేక సార్లు బయటకు వెళ్లింది. సుమారు 10 రోజుల క్రితం పార్కుకు తిరిగి తీసుకువచ్చారు. కానీ మళ్లీ బయటకు వెళ్లింది.కునో నేషనల్ పార్క్ అంచనా సామర్థ్యం 21కి మించి ఇప్పటికే 23 చిరుతలను కలిగి ఉంది. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం రెండవ ఆవాసాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. కానీ అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రం చెబుతోంది.ప్రస్తుతానికి కొన్ని చిరుతలను వెంటనే కునో నుండి మరొక ఆవాసానికి తరలించే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు NTCA సభ్య కార్యదర్శి డాక్టర్ ఎస్.పీ యాదవ్ అన్నారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం కొన్ని చిరుతలను ఎందుకు తరలించాలనుకుంటున్నది? కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ యొక్క చిరుత యాక్షన్ ప్లాన్, కునో 21 చిరుతలను ఉంచగలదని అంచనా వేసింది. పార్క్లో ఇప్పటికే 23 చిరుత పెద్దలు, పిల్లలు ఉన్నాయి. వీటిలో ఎనిమిది చిరుతలను గత ఏడాది సెప్టెంబర్లో నమీబియా నుంచి తీసుకురాగా, మరో 12 చిరుతలను ఈ ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి బదిలీ చేశారు. నమీబియా చిరుతల్లో ఒకటైన సాషా మరణించింది, అయితే మరో ఆడ సియాయా నాలుగు పిల్లలను ప్రసవించింది. కునో పార్క్ యాజమాన్యం మరిన్ని చిరుతలకు జన్మనిస్తుందని ఆశిస్తోంది. ఇది వాటి సంఖ్యను మరింత పెంచుతుంది. దక్షిణాఫ్రికా చిరుతలను అడవిలో వదలడంపై త్వరలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర వన్యప్రాణి విభాగం ఉన్నతాధికారులు చెబుతున్నారు.
Also Read:UP Govt: రోడ్లపై మతపరమైన కార్యక్రమాలకు నో.. ఈద్కు ముందు యోగి ప్రభుత్వం ఆంక్షలు
అడవిలో ఉన్న చిరుతలను ఒకేసారి పర్యవేక్షించడం చాలా కష్టం అని, 19 వయోజన చిరుతలను పర్యవేక్షించడానికి బహుళ బృందాలు అవసరం అని అధికారులు పేర్కొంటున్నారు. ఇందుకోసం 100 మంది కంటే ఎక్కువ అవసరం ఉంటుందని కునో పార్క్ అధికారి తెలిపారు. మానిటరింగ్ టీమ్లు, వారి వాహనాలు, పరికరాలు చిరుతలకు కలిగించే అవాంతరాల పరంగా పెద్ద ప్రభావం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
చిరుత యాక్షన్ ప్లాన్ అడవి పిల్లుల కోసం నాలుగు ఇతర ఆవాసాలను పేర్కొంది. రాజస్థాన్లోని గాంధీ సాగర్-భైన్స్రోర్ఘర్ వన్యప్రాణుల అభయారణ్యాల సముదాయం ఒకటి. మధ్యప్రదేశ్ లోని నౌరదేహి అభయారణ్యం, రాజస్థాన్లోని షాఘర్ బల్గే, ముకుందరా ఉండగా.. వీటిలో గాంధీ సాగర్ అభయారణ్యంలో 80 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫెన్సింగ్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.ముకుందరా హిల్స్ నేషనల్ పార్క్ ఆవాసంగా సిద్ధంగా ఉందని, ఇది ఇప్పటికే సుమారు 80 చదరపు కిలోమీటర్ల కంచెతో కూడిన ప్రాంతాన్ని కలిగి ఉందని, అక్కడ చిరుతలను విడిచిపెట్టవచ్చని వర్గాలు తెలిపాయి. అంతేకాదు ముకుందరలో చిరుతలు తక్కువగా ఉన్నాయి. 80 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 5-6 చిరుతలను సులభంగా ఆదుకోవచ్చు అని అటవీ శాఖ అధికారి తెలిపారు. అంతర్జాతీయ చిరుత నిపుణులు ముకుందరాను సందర్శించి చిరుతలకు అనువైన ఆవాసాన్ని కనుగొన్నారని రాజస్థాన్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, రాష్ట్ర వన్యప్రాణి బోర్డు సభ్యుడు భరత్ సింగ్ అన్నారు. రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ముకుందరాను పరిగణనలోకి తీసుకోవడం లేదని చెప్పారు.
Also Read:Perfumes : మగవారు ఆ టైమ్లో ఈ పెర్ఫ్యూమ్స్ వాడితే.. ఆడవారికి చాలా ఇష్టమట..
మరోవైపు కునో నుంచి తప్పించుకున్న ఒబాన్ చిరుత కునో వెలుపల మూడు క్రిష్ణ జింకలను వేటాడాడు. చిరుతను తిరిగి తీసుకురావడానికి ఇంకా ప్రణాళికలు లేవు. అయితే, తాము ఒబాన్ కదలికలను పర్యవేక్షిస్తున్నామని చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ జె.ఎస్. చౌహాన్ చెప్పారు. ఒకవేళ ఒబాన్కు లేదా ఒబాన్ నుండి ఇతరులకు ముప్పు ఉన్నట్లయితే, తాము వెంటనే చిరుతని తిరిగి కునోకు తీసుకువస్తామని తెలిపారు.
కాగా, దేశంలో అంతరించిపోయిన చీతాలను తిరిగి వీటిని ప్రవేశపెట్టే ప్రాజెక్ట్కు 2020లో సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో తొలి విడతగా గతేడాది సెప్టెంబరులో నమీబియా నుంచి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వీటిలో సాశ అనే ఆడ చిరుత గత నెల అనారోగ్యంతో కన్నుమూసింది. ఇక, ఒబాన్ కునో జాతీయ పార్కుకు 20 కిలోమీటర్ల దూరంలోని విజయపూర్లోని జార్ బరోడా గ్రామంలోకి ప్రవేశించింది. ఒబాన్ బరోడా గ్రామంలోని పంట పొలాల్లో సంచరిస్తున్నట్టు చీతా మెడకు అమర్చిన పరికరం ద్వారా గుర్తించారు. ఓబాన్, ఆశా అనే రెండు చిరుతలను మార్చి 11న కునో నేషనల్ పార్క్ అడవిలో విజయవంతంగా విడుదల చేశారు. దేశంలో అంతరించిపోయిన జాతుల జాబితాలో ఉన్న చిరుతల 70 సంవత్సరాల తరువాత తిరిగి భారత గడ్డపై కాలుమోపాయి. రెండు దశల్లో మొత్తం 20 చిరుతలను తీసుకొచ్చారు. గతేడాది సెప్టెంబరులో నమీబియా నుంచి మొదటి బ్యాచ్ ఎనిమిది చిరుతలు, ఈ ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి మరో 12 వచ్చాయి. ఒకప్పుడు ఆసియాటిక్ చిరుతలకు నిలయంగా ఉండే భారత్లో 1952 నాటికి ఈ జాతి అంతరించిపోయినట్లు ప్రకటించారు.
