NTV Telugu Site icon

ఉడిపిలో అరుదైన చేప‌… వేలంలో భారీ ధ‌ర‌కు అమ్మ‌కం…

అప్పుడ‌ప్పుడు మ‌త్స్య‌కారుల వ‌ల‌కు అరుదైన చేప‌లు దొరుకుతుంటాయి.  అలా దొరికిన వాటిని వేలంలో భారీ ధ‌ర‌ల‌కు విక్ర‌యిస్తుంటారు.  ఇలానే, క‌ర్ణాట‌క‌లోని ఉడిపిలో మ‌త్స్య‌కారుని వ‌ల‌కు అరుదైన ఘోల్ ఫిష్ చిక్కింది.  ఈ ర‌క‌మైన చేప‌ల‌కు బ‌హిరంగ మార్కెట్‌లో భారీ ధ‌ర ఉంటుంది.  పెద్ద మొత్తంలో చెల్లించి వీటిని కొనుగోలు చేస్తుంటారు.  ఈర‌క‌మైన చేప‌ల్లో ఔష‌ద‌గుణాలు అధికంగా ఉంటాయి.  మెడిస‌న్ రంగంలో వీటిని వినియోగిస్తుంటారు.  

Read: జ‌రభ‌ద్రం: ఆ వైర‌స్ గాలిలో మూడు మీట‌ర్ల‌కు మించి ప్రయాణం చేయ‌గ‌ల‌దు…

ఉడిపిలో మ‌త్స్య‌కారునికి 18 కిలోల బ‌రువైన ఘోల్ ఫిష్ దొరికింది.  వ‌ల‌కు చిక్కిన ఈ చేప‌ను మాల్పే ఓడ‌రేవుకు తీసుకొచ్చి వేలం వేశారు.  అరుదైన చేప కావ‌డంతో కిలోకి 10 వేల చొప్పున 18 కిలోల చేప‌ను రూ.1.80 ల‌క్ష‌లకు అమ్మారు.  సాధార‌ణంగా ఘోల్ చేప‌ల మాంసం చాలా బ‌ల‌మైన ఆహారం అని, ఈ ర‌క‌మైన చేప‌లు కిలో 9 నుంచి 10 వేల వ‌ర‌కు ప‌లుకుతుంద‌ని మ‌త్స్య‌కారులు చెబుతున్నారు. చాలా కాలంగా తాను స‌ముద్రంలో చేప‌ల వేట‌కు వెళ్తున్నాన‌ని, కానీ, ఇలాంటి అరుదైన చేప‌లు వ‌ల‌కు చిక్క‌డం ఇదే మొద‌టిసారి అని మ‌త్స్య‌కారుడు చెప్పుకొచ్చాడు.