Site icon NTV Telugu

హుజురాబాద్ లో దళిత బంధుకు బ్రేక్..

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు పథకానికి బ్రేక్ పడింది. దళిత బంధును నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం తెలంగాణలోని హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ముందు తెరాస ప్రభుత్వం దళిత బంధు అనే పథకాన్ని తెచ్చి రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇక ఈ పథకాన్ని హుజురాబాద్ నుండే ప్రారంభించనున్నట్లు తెలిపింది. దాంతో దీని పై చాలా ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఆ ఫిర్యాదుల పై నిర్ణయం తీసుకున్న ఎలక్షన్ కమిషన్ ఈ నెల 30 న జరగనున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక వరకూ ఈ దళిత బందును నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Exit mobile version