కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు దేశంలో ప్రస్తుతం మూడు రకాల ఔషదాలు అందుబాటులో ఉన్నాయి. కోవిషీల్డ్, కోవాగ్జిన్ తో పాటుగా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. కాగా, ఇప్పుడు డిఆర్డిఓ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తో కలిసి ఓ ఔషధాన్ని తయారు చేసింది. అది 2 డిజీ ఔషధం. రెడ్డీస్ ల్యాబ్స్ దీనిని ఉత్పత్తి చేస్తున్నది.
ఈరోజు ఈ ఔషధాన్ని రిలీజ్ చేస్తున్నారు. రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వర్చువల్ విధానం ద్వారా ఈరోజు రిలీజ్ చేస్తున్నారు. మొదటగా వీటిని ఢిల్లీలోని డిఆర్డిఓ ఆసుపత్రిలో కరోనా రోగులకు అందించనున్నారు. పౌడర్ రూపంలో అందుబాటులోకి వచ్చిన ఈ ఔషధం ఎలా పనిచేస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కరోనా చికిత్సకు కొత్త ఔషధం… నేడే విడుదల
