ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కొరడా దెబ్బలు తిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.. అదేంటి సీఎంకు కొరడా దెబ్బలు ఏంటి? అనే అనుమానం వెంటనే కలుగొచ్చు.. ఏ ఆలయానికైనా వెళ్లినప్పుడు.. అక్కడ నమ్మకాలు, భక్తుల విశ్వాసం మేరకు కొన్ని చేస్తుంటారు.. అలాంటే నమ్మకాన్నే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ ఫాలో అయ్యారు.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Read Also: కోమటిరెడ్డి బ్రదర్స్ను కలుపుకుపోవాలి.. నేను మాట్లాడుతా..
ఛత్తీస్గఢ్ లోని దుర్గ్లో ప్రతి ఏడాది గోవర్ధన్ పూజ నిర్వహిస్తారు.. ఇందులో భాగంగా గోవుకు విశిష్టమైన పూజలు చేస్తారు. ఆ తర్వాత భక్తులు కొరడాతో కొట్టించికుంటారు.. గోవర్ధన్ పూజ తర్వాత కొరడా దెబ్బలు తింటే సమస్యలు అన్నీ తొలగిపోతాయని ప్రజల నమ్మకం.. ఇక, దుర్గ్లోని జంజిగిరి గ్రామంలో గోవర్ధన్ పూజకు హాజరయ్యారు సీఎం భూపేశ్ బఘేల్.. ఈ సందర్భంగా బీరేంద్ర ఠాకూర్ అనే వ్యక్తితో సీఎం భూపేశ్ బఘేల్ను కొరడాతో కొట్టించుకున్నారు.. ఇక, ఆ తర్వాత సీఎం మాట్లాడుతూ.. గోవును పూజించే ఈ గోవర్ధన్ పూజా కార్యాక్రమం చాలా గొప్పసంప్రదాయంగా తెలిపారు.. మన సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోకుండా భావి తరాలకు అందించడం మనంది బాధ్యత అన్నారు. అయితే, సీఎం కొరడాతో కొట్టించుకున్న వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.
