హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదట 723 పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అధికారులు టీఆర్ఎస్కు ఎక్కువగా ఓట్లు వచ్చినట్లు తెలిపారు. అనంతరం ఈవీంఏంలలో ఓట్లను లెక్కింపును ప్రారంభించారు. మొత్తం 22 రౌండ్లు నిర్వహించనున్నారు.
తొలి రౌండ్ నుంచి ఏడో రౌండ్ వరకు బీజేపీ లీడ్లో ఉండగా.. ఎనిమిదో రౌండ్లో టీఆర్ఎస్ 162 ఓట్ల ఆధిక్యం సాధించింది. కానీ.. టీఆర్ఎస్ తరువాతి రౌండ్లో ఆధిక్యత కొనసాగించలేకపోయింది. తొమ్మిదో రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల 1,835 ఓట్ల ఆధిక్యత సాధించారు. తొమ్మిదో రౌండ్ ముగిసే సరికి 5,105 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.